అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం గద్దె రామ్మోహన్

0
162

*అర్హులైన ప్రతి ఒక్కరికి ఫించన్లు, ఇళ్ళ స్థలాలు అందజేస్తాం*

*ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌*

++++

 

           అర్హులైన ప్రతి ఒక్కరికీ ఫించన్ల మంజూరు, ఇళ్ళ స్థలాల కేటాయింపు చేస్తామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. 

 

   పటమట అశోక్‌నగర్‌లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం ఆవరణలో ప్రజాదర్బార్‌ కార్యక్రమం శుక్రవారం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ హజరై ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతిపత్రాలను స్వీకరించారు. 

   

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలోని ఎమ్మెల్యేలందరితో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారని, ఈ సమావేశంలో ప్రజాదర్బార్‌లో వచ్చిన ముఖ్యమైన సమస్యలను ఆయనకు తెలియజేస్తానని శాసనసభ్యులు చెప్పారు. వివిధ ప్రభుత్వ శాఖ ఉన్నతాధికారులు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారని అందువల్ల ఆ సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని చెప్పారు. ప్రజాదర్బార్‌లో తెలియజేసిన సమస్యల్లో ఆర్థిక పరమైన సమస్యలు పరిష్కరించడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. ఫించన్ల మంజూరు, ఇళ్ళ స్థలాల కేటాయింపుపై ప్రజలు ఎక్కువుగా అడుగుతున్నారని, ఈ అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తామనని చెప్పారు. ఆటోనగర్‌లో విద్యుత్‌ సమస్యల పరిష్కారంపై విద్యుత్‌ శాఖ ఎస్‌ఈతో మాట్లాడతానన్నారు. ప్రజదర్బార్‌లో ప్రజలు తెలియజేసిన ప్రతి సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. 

 

ఈ కార్యక్రమంలో చెన్నుపాటి గాంధీ, వివిద కార్పొరేషన్ల డైరెక్టర్లు, తెలుగుదేశం పార్టీ డివిజన్‌ అధ్యక్షులు, పార్టీ నాయకులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అంబేద్కర్ జయంతి వేడుకలు: భవనం, విగ్రహ ఏర్పాటుపై పోరాటం కొనసాగింపు
చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలంలోని నల్లూరుపల్లి గ్రామంలో ఆదివారం, 12 ఏప్రిల్ 2026న డాక్టర్...
By Kothuru Murali 2026-04-13 08:10:25 0 118
Andhra Pradesh
పుంగునూరు :అన్నమయ్య జిల్లాలోకి పుంగనూరు నియోజకవర్గ పోలీస్ స్టేషన్లు
పుంగనూరు నియోజకవర్గంలోని పోలీసు స్టేషన్లను అన్నమయ్య జిల్లాలోకి కలుపుతూ రాష్ట్ర హోం శాఖ...
By Kothuru Murali 2026-01-22 13:03:51 0 181
Andhra Pradesh
మత్తు పదార్థాలతో కుటుంబాలు చిన్నాభిన్నం
మత్తు పదార్దాలు వలన కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయని పట్టణ సీఐ కె.నారాయణరావు అన్నారు. బొబ్బిలి...
By Boiena Rajesh 2026-03-03 12:59:40 0 193
Himachal Pradesh
Nihang Standoff at Paonta Sahib: March Suspended
Over 150 Nihang Sikhs are currently camping at the historic Paonta Sahib gurdwara in Himachal...
By Lokeshwari Panthadi 2026-06-27 09:24:17 0 73
Andhra Pradesh
మదనపల్లె: ‘డ్రగ్స్ కట్టడికి చిత్తశుద్ధితో పనిచేయాలి.
యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా, డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని...
By Pagadala Venkateswar 2026-02-22 06:35:16 0 147
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com