అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం గద్దె రామ్మోహన్

0
130

*అర్హులైన ప్రతి ఒక్కరికి ఫించన్లు, ఇళ్ళ స్థలాలు అందజేస్తాం*

*ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌*

++++

 

           అర్హులైన ప్రతి ఒక్కరికీ ఫించన్ల మంజూరు, ఇళ్ళ స్థలాల కేటాయింపు చేస్తామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. 

 

   పటమట అశోక్‌నగర్‌లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం ఆవరణలో ప్రజాదర్బార్‌ కార్యక్రమం శుక్రవారం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ హజరై ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతిపత్రాలను స్వీకరించారు. 

   

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలోని ఎమ్మెల్యేలందరితో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారని, ఈ సమావేశంలో ప్రజాదర్బార్‌లో వచ్చిన ముఖ్యమైన సమస్యలను ఆయనకు తెలియజేస్తానని శాసనసభ్యులు చెప్పారు. వివిధ ప్రభుత్వ శాఖ ఉన్నతాధికారులు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారని అందువల్ల ఆ సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని చెప్పారు. ప్రజాదర్బార్‌లో తెలియజేసిన సమస్యల్లో ఆర్థిక పరమైన సమస్యలు పరిష్కరించడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. ఫించన్ల మంజూరు, ఇళ్ళ స్థలాల కేటాయింపుపై ప్రజలు ఎక్కువుగా అడుగుతున్నారని, ఈ అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తామనని చెప్పారు. ఆటోనగర్‌లో విద్యుత్‌ సమస్యల పరిష్కారంపై విద్యుత్‌ శాఖ ఎస్‌ఈతో మాట్లాడతానన్నారు. ప్రజదర్బార్‌లో ప్రజలు తెలియజేసిన ప్రతి సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. 

 

ఈ కార్యక్రమంలో చెన్నుపాటి గాంధీ, వివిద కార్పొరేషన్ల డైరెక్టర్లు, తెలుగుదేశం పార్టీ డివిజన్‌ అధ్యక్షులు, పార్టీ నాయకులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అమరావతిని రాజధానిగా ప్రకటించినందుకు పుంగనూరులో సంబరాలు
.డి. డి.ఆర్.డి.ఎ ఆదేశాల మేరకు, అమరావతిని రాజధానిగా ప్రకటించినందుకు పుంగనూరులో ప్రజలు గురువారం...
By Kothuru Murali 2026-04-03 09:28:03 0 109
Telangana
36 వ మున్సిపల్ డివిజన్లోని ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం లో పాల్గొన్న మాజీ డీసీసీ అధ్యక్షురాలు : కొక్కిరాల సురేఖ
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 36వ డివిజన్ లో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లు...
By Avunoori Mahesh 2026-04-26 12:45:49 0 119
Telangana
బోరు బావి ప్రారంభించిన నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు...
మర్రిపల్లి/దుగ్గొండి భారత్ ఆవాజ్ న్యూస్... దుగ్గొండి :మండలం,మర్రిపల్లి గ్రామంలో నూతనంగా...
By Gujile Ramu 2026-04-28 02:59:36 0 97
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గంలో ఓ మోస్తరుగా వర్షం
గురువారం సాయంత్రం పుంగనూరు నియోజకవర్గంలో వాతావరణం ఒక్కసారిగా మారి, ఓ మోస్తరు వర్షం కురిసింది....
By Kothuru Murali 2026-05-01 11:40:58 0 61
Andhra Pradesh
ప్రజలు డిసెంబర్ 31 ఆంక్షలు పాటించాలని సిఐ గారి విన్నపం గారి విన్నపం
ఆంక్షలు పాటించాలని అర్బన్ సీఐ సుబ్బరాయుడు విజ్ఞప్తి చేశారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో...
By Kothuru Murali 2025-12-30 12:53:07 0 141
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com