నిజామాబాద్.:కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పును హర్షించిన మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల...

1
386

తేదీ:23.04.2026.

నిజామాబాద్.కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పును హర్షించిన మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల...

నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గణేష్ బిగాల గారు మాట్లాడుతూ...కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించడం ద్వారా న్యాయం గెలిచిందని పేర్కొన్నారు.

కమిషన్ విచారణలో ప్రాథమిక నిబంధనలు పాటించలేదని కోర్టు స్పష్టం చేయడం ద్వారా ఆ నివేదికకు చట్టపరమైన ప్రాముఖ్యత లేదని తేలిందన్నారు.

ముఖ్యంగా సెక్షన్–8 కింద సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించడం అత్యంత కీలకమని తెలిపారు.బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు, మాజీ మంత్రి హరీష్ రావు గారిపై రాజకీయంగా ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కమిషన్‌లను అడ్డంపెట్టుకుని వేధింపులకు పాల్పడిందని విమర్శించారు.

న్యాయస్థానాలపై నమ్మకంతో పోరాడగా, చివరకు నిజం గెలిచిందని పేర్కొన్నారు.

తెలంగాణ జీవధారగా భావించే కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కక్షపూరితంగా వ్యవహరించాయని విమర్శించారు.ప్రాజెక్టు మరమ్మతులను సకాలంలో చేపట్టకుండా దాదాపు రెండున్నరేళ్లు ఆలస్యం చేశారని, చివరకు గత్యంతరం లేక ఇప్పుడు పనులు చేపడుతున్నారని అన్నారు.కాళేశ్వరం విషయంలో కేసీఆర్ గారిపై చేసిన ఆరోపణలు నిరాధారమని ఈ తీర్పుతో స్పష్టమైందని, కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలకు ఈ తీర్పుతో ఇకనైనా కనువిప్పు కలగాలని సూచించారు.కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ వేధింపులను పక్కన పెట్టి పాలనపై దృష్టి సారించి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని గణేష్ బిగాల గారు సూచించారు.న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందనే విశ్వాసానికి ఈ హైకోర్టు తీర్పు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ VG గౌడ్ గారు,మాజీ మేయర్ దండు నీతుకిరణ్ శేఖర్,పార్టీ నగర అధ్యక్షులు సిర్ప రాజు,మాజీ NUDA చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి,సుజిత్ సింగ్,నవీద్ ఇక్బాల్, గాండ్ల లింగం,మతీన్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Pawan Kalyan: పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన వాయిదా.
Pawan Kalyan: పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన వాయిదా 27-01-2026 Tue 15:46 | Andhra Pawan Kalyan...
By Pagadala Venkateswar 2026-01-28 10:39:12 0 154
Andhra Pradesh
అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం సోషల్ వెల్ఫేర్ పాఠశాలను సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
*Photos :-* అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2025-12-20 12:01:46 0 196
Andhra Pradesh
ఆడ వేషంతో మోసాలు.. నిందితుడిపై కేసు నమోదు.
మదనపల్లె కేంద్రంగా ఆడవేషం వేసుకుని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిపై మంగళవారం పోలీసులు కేసు నమోదు...
By Pagadala Venkateswar 2026-06-24 04:20:24 0 47
Andhra Pradesh
Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్ న్యూస్.
14 గ్రామాలకు చెందిన 90 మంది రైతులకు ఈరోజు ప్లాట్ల కేటాయింపు  ఈ-లాటరీ పద్ధతి ద్వారా ప్లాట్ల...
By Pagadala Venkateswar 2026-01-23 05:45:48 0 355
Andhra Pradesh
పుంగనూరు: అలా చేశారంటే తల్లిదండ్రులకు ఇచ్చే తప్పదు: ఎం వి ఐ
మైనర్లు వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరమని, తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇస్తే శిక్షార్హులవుతారని...
By Kothuru Murali 2026-06-04 14:47:02 0 83
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com