గ్రామ సంఘాల సహాయకులకు(VOA) స్మార్ట్ ఫోన్లు పంపిణీ

0
284

గ్రామ సంఘాల అభివృద్ధికి స్మార్ట్ అడుగు – VOAలకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ

నందిగామలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేతుల మీదుగా ఫోన్ల అందజేత..

నందిగామ, బుధవారం: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సంఘాల సహాయకులకు (VOAలు) స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం బుధవారం నాడు నందిగామ పట్టణంలోని రైతుపేట ఓసీ క్లబ్‌లో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హాజరై కూటమి నేతలతో కలిసి VOAలకు స్మార్ట్ ఫోన్లను అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సేవల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు సాంకేతికత ఎంతో కీలకమని పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్ల ద్వారా గ్రామ సంఘాల కార్యకలాపాలు మరింత పారదర్శకంగా, వేగవంతంగా కొనసాగుతాయని తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలులో VOAల పాత్ర ముఖ్యమని, వారికి అందిస్తున్న ఈ సౌకర్యాలు గ్రామీణాభివృద్ధికి దోహదపడతాయని అన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న VOAలు సంతోషం వ్యక్తం చేస్తూ, తమ పనితీరును మరింత మెరుగుపర్చేందుకు ఈ స్మార్ట్ ఫోన్లు ఉపయుక్తంగా ఉంటాయని తెలిపారు.ఈకార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా సమైక్య అధ్యక్షురాలు కందుల కల్పన, మండల సమైక్య అధ్యక్షులు, మార్కెట్ కమిటీల రాష్ట్ర ఉపాధ్యక్షులు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, స్థానిక కూటమి నాయకులు, అధికారులు, గ్రామ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రామకోటయ్య ఇండోర్ స్టేడియాన్ని సందర్శించిన సాఫ్ట్ చైర్మన్ అని మినీ రవి నాయుడు
*ఫర్ స్క్రోలింగ్**   *శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు**   • చెన్నుపాటి...
By Rajini Kumari 2025-12-16 09:34:03 0 182
Telangana
నిజామాబాద్: బసులు బంద్
నిజామాబాద్ ఆర్టీసీ కార్మికులు సమ్మే  కరణంగా జిల్లాలో  బసులు బంధు కవాడo తో ప్రయానికులు...
By Sadaq Sadaq 2026-04-22 09:29:23 0 139
Andhra Pradesh
​శాంతిభద్రతలపై సీఎం సమీక్ష: పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎస్పీ.
అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన శాంతిభద్రతల సమీక్షా...
By Pagadala Venkateswar 2026-03-13 07:15:04 0 177
SURAKSHA
Pronab Mohanty, IPS: Leading Karnataka with Courage & Vision
A distinguished 1994-batch Karnataka cadre IPS officer whose leadership, integrity, and...
By Lokeshwari Panthadi 2026-07-18 11:43:43 0 42
Andhra Pradesh
పుంగనూరు: మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసిన ఎంపీలు
రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల బృందం బుధవారం జాతీయ మానవ హక్కుల సంఘం...
By Kothuru Murali 2026-02-04 16:18:18 0 161
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com