కాలుష్య పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

0
69

తనిఖీ కమిటీలలో బాధితులను భాగస్వామ్యం చేయాలని కీలక సూచన

గోస్తనీ నది కాలుష్యంపై అత్యవసర పరిస్థితిగా గుర్తింపు

శబ్ద కాలుష్య నిబంధనలు అందరికీ వర్తిస్తాయని స్పష్టీకరణ

నెల్లూరు 'వైట్ కేటగిరి' పరిశ్రమల కాలుష్యంపై విచారణకు ఆదేశం

దేశ పురోగతికి పరిశ్రమలు ఎంత ముఖ్యమో, ప్రజల ఆరోగ్యం, పర్యావరణాన్ని కాపాడటం కూడా అంతే ముఖ్యమని ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కేవలం నివేదికలకే పరిమితం కావొద్దని ఆయన అధికారులను ఆదేశించారు. నిన్న మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పీసీబీ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

 

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తనిఖీ ప్రక్రియలో పారదర్శకత కోసం బాధితులను కూడా భాగస్వాములను చేయాలని సూచించారు. శబ్ద కాలుష్య నియంత్రణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పరిశ్రమలు, సంస్థలు, ప్రార్థనా మందిరాలతో సహా ప్రతీ ఒక్కరూ పాటించాల్సిందేనని, ఎవరికీ మినహాయింపులు లేవని తేల్చిచెప్పారు. కొన్ని పరిశ్రమలు చట్ట ప్రకారం గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

 

గోస్తనీ నది తీవ్రంగా కాలుష్యమైందని, అక్కడ పర్యావరణ అత్యవసర పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. నదిలో వ్యర్థాలు వదులుతున్న పరిశ్రమలను డ్రోన్లు, వీడియో కెమెరాల ద్వారా గుర్తించి బాధ్యులను చేయాలన్నారు. నెల్లూరు జిల్లాలో 'వైట్ కేటగిరి' కింద నమోదైన కొన్ని పరిశ్రమలు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయన్న ఫిర్యాదులపై విచారణ జరపాలని ఆదేశించారు.

 

రాష్ట్రంలోని 13 నగరాల్లో గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు 'నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం' కింద కేటాయించిన రూ.400 కోట్ల నిధులను సక్రమంగా వినియోగించాలని సూచించారు. పీసీబీలో సిబ్బంది కొరతపై అధికారులు ప్రస్తావించగా, నియామకాల ఫైలును వెంటనే ముందుకు తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

Search
Categories
Read More
Chandigarh
Pharmacy Strike: Nationwide Shutdown Hits Tricity Stores
Medicines are facing a temporary squeeze today as pharmacies across Chandigarh join a 24-hour...
By Dunna Jessicaruth 2026-05-20 09:09:35 0 66
Telangana
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జూలై 1 నుండి 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలు జిల్లా ఎస్పీ నితిక పంత్
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల దృష్ట్యా, ప్రశాంత వాతావరణ పరిస్థితులను మరింత...
By Chunarkar Jagadeesh 2026-07-01 16:56:40 0 184
Telangana
గవర్నర్ కు విజయ్ లేఖ. సీఎం గా ప్రమాణం ఎప్పుడూ?
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ గవర్నర్ రాజేంద్రకు TVK చీప్ విజయ్ లేఖ రాసినట్లు...
By MERIGE MALLESH 2026-05-05 04:49:55 0 571
Bharat Aawaz
Naked Officials: The Secret Threat to India's Security!
Is India's education system facing a terminal crisis? With over 60 major exam paper leaks like...
By Hazu MD. 2026-06-08 09:04:16 0 208
Andhra Pradesh
Mohan Babu: మోహన్ బాబు, మంచు విష్ణులపై కిడ్నాప్ కేసు నమోదు.
ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి అక్బర్, ఎస్వీయూ విద్యార్థి నేత వినోద్ కిడ్నాప్ కిడ్నాపర్లను గంటన్నరలో...
By Pagadala Venkateswar 2026-02-04 07:34:06 0 159
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com