ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాలీబాల్ పోటీలను ప్రారంభించిన మేయర్ : ధర్ని మధుకర్

0
123

మంచిర్యాల : ఈశ్వర్ ప్రసాద్ స్మరక ఉమ్మడి ఆదిలాబాద్ వాలీబాల్ టోర్నమెంట్ ను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ లో ఉమ్మడి అదిలాబాద్ జిల్లాల నలుమూల నుండి 32 టీములు పాల్గొనడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులకు భోజన సదుపాయాన్ని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సమకూర్చడం జరిగింది, మొదటి బహుమతి 20,000 /- స్వరూప హాస్పిటల్ మంచిర్యాల, రెండవ బహుమతి 15,000/- ట్రినిటీ హైస్కూల్ మంచిర్యాల, మూడో బహుమతి 10,000/- నారాయణ సర్జికల్ హాస్పిటల్ మంచిర్యాల, నాలుగో బహుమతి 5,000/- వంశీ బిల్డర్స్ మంచిర్యాల లు సమకూర్చడం జరిగింది.

ఈ టోర్నమెంట్ ను ఉద్దేశించి మేయర్ ధరణి మధుకర్ మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అన్ని క్రీడలను ప్రోత్సహిస్తుంది ప్రత్యేక క్రీడా పాలసీని తీసుకువచ్చింది దీని ద్వారా రాష్ట్రంలో అన్ని క్రీడలలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడానికి వీలవుతుందని అదేవిధంగా పెద్దలు మంచిర్యాల శాసనసభ్యులు ప్రత్యేక శ్రద్ధ వహించి మంచిర్యాల సాయి కుంటలో స్టేడియం నిర్మాణానికి గాను 14 ఎకరాల స్థలాన్ని కేటాయించి అంతర్జాతీయ స్థాయిలో అన్ని క్రీడాంశాలకు సంబంధించి క్రీడా వసతులతో ప్రత్యేక శ్రద్ధతో అతి త్వరలో ఈ స్టేడియంలో మంచిర్యాల ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ కార్పొరేటర్ నల్ల శంకర్, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మైలారం శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి రావుల రామ్మోహన్, ఉపాధ్యక్షులు బైరగొని సిద్దయ్య గౌడ్, ట్రెజరర్ గాజుల శ్రీనివాస్, జాతీయ వాలీబాల్ క్రీడాకారులు లక్షట్టి గురవయ్య, చిందం శ్రీనివాస్ సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు రాష్ట్రపతి అవార్డు గ్రహీత లక్షెట్టి లక్ష్మీనారాయణ, గడియార మురళి, సల్కాపురం రఘు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
బాలిక రిషిక ప్రియా హత్య కేసు: నిందితుడు ఆత్మహత్య, ప్రజల సంబరాలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బాలిక రిషిక ప్రియా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బుధవారం...
By Pagadala Venkateswar 2026-02-18 06:46:00 0 119
Andhra Pradesh
చరిత్రలో లేని విధంగా నూతన అధ్యాయానికి నాంది పలికిన ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్.
వక్ఫ్ బోర్డు చరిత్రలో తొలిసారి.  చరిత్రలో లేని విధంగా నూతన అధ్యాయానికి నాంది పలికిన ఏపీ...
By John Baji 2026-02-03 03:29:18 0 121
Telangana
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువైనా ట్రాఫిక్ చలాన్లు.|
హైదరాబాద్ : ఈ ఏడాది సైబరాబాద్ పరిధిలో రూ.239.37 కోట్ల ట్రాఫిక్ చలాన్లు గత ఏడాది రూ.111.81 కోట్లు...
By Sidhu Maroju 2025-12-26 09:19:38 0 159
Telangana
న్యూయర్ ఫీవర్.. మీటర్ దాటితే జైలుకే..! వాహనదారులకు మాస్ వార్నింగ్!
న్యూయర్ వేడుకల పేరుతో రోడ్లపై హంగామా సృష్టిస్తూ, హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని వాహనదారులకు...
By SivaNagendra Annapareddy 2025-12-25 06:32:33 0 494
Andhra Pradesh
పుంగునూరు:పుంగనూరులో ఫుడ్ సేఫ్టీ అధికారి పరిశీలన
పుంగనూరు పట్టణంలో బుధవారం మధ్యాహ్న భోజనంలో బల్లి పడిన ఘటనపై ఫుడ్ ఇన్స్పెక్టర్ గురు లక్ష్మి...
By Kothuru Murali 2026-04-03 09:20:17 0 141
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com