మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ అడ్మిషన్ల సందడి

0
134

 

సూర్యమోహన్, మద్దూరు మండలం రిపోర్టర్

 

 

మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ అడ్మిషన్ల సందడి

 

 

కోడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి దోస్త్ మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది.ఈ నెల 15న మొదలైన దరఖాస్తుల గడువు మే7వరకు కొనసాగుతుందని ప్రిన్సిపల్ బి కృష్ణారెడ్డి తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.కళాశాలలో బీఏ, బీకామ్,బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ (ఎంపీసీఎస్,బీజెడ్‌సీ) కోర్సులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు,ప్రభుత్వ స్కాలర్‌షిప్,ఫీజు రీయింబర్స్‌మెంట్ సౌకర్యాలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు మీ-సేవా కేంద్రాల ద్వారా లేదా దోస్త్ వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఇతర వివరాలకు కళాశాల కార్యాలయంలో సంప్రదించాలని కళాశాల ప్రిన్సిపాల్ సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదేశాలతో మొబైల్ మెడికల్ క్యాంప్
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 20 డివిజన్లో, ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదేశాల మేరకు నంబూరు సుభాని...
By John Baji 2025-12-30 02:22:38 0 177
Andhra Pradesh
మదనపల్లిలో ఘనంగా హోంగార్డుల పెరేడ్.
మదనపల్లిలో హోంగార్డుల జిల్లా స్థాయి పరేడ్ శుక్రవారం ఘనంగా జరిగింది. రాయలసీమ రీజియన్ కమాండెంట్...
By Pagadala Venkateswar 2026-04-10 12:09:33 0 70
Telangana
మైనార్టీ స్మశాన వాటికకు స్థలాన్ని కేటాయించండి : ఎమ్మెల్యే.|
   మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో...
By Sidhu Maroju 2025-12-16 13:40:34 0 213
Andhra Pradesh
చేనేత నేతన్నలకు ఉచిత విద్యుత్: ఎమ్మెల్యే షాజహాన్ భాష ప్రకటన.
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలోని కోళ్ల బైలు టు పంచాయతీ బాబు కాలనీ సచివాలయంలో బుధవారం చేనేత జౌళి...
By Pagadala Venkateswar 2026-04-02 05:47:39 0 105
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com