వాహనాలు ఆపి డబ్బులు వసూలు చేస్తున్న సూడో పోలీస్ : అరెస్ట్ చేసిన పోలీసులు.|

0
130

సికింద్రాబాద్ : బోయిన్ పల్లి పిఎస్ పరిధిలో నకిలీ పోలీసుగా చలామణి అవుతూ వాహనదారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న మసూద్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఉత్తర మండల డిసిపి రష్మీ పెరుమాళ్ తెలిపారు.నాగపూర్ జాతీయ రహదారి పక్కనే వాహనాలను ఆపి తనిఖీ చేస్తూ వాహనదారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అల్వాల్ కు చెందిన రంజన్ మాలిక్ అనే వ్యక్తి నెంబర్ ప్లేట్ లేని వాహనంపై వస్తుండగా అతన్ని ఆపినట్లు తెలిపారు. వాహనంపై చలాన్లు ఉన్నాయని 2 వేల రూపాయలు జరిమానా చెల్లించాలని డిమాండ్ చేయడంతో 400 రూపాయలు చెల్లించారు.సివిల్ దుస్తులలో ఉన్న వ్యక్తి పోలీసు అని చెప్పడంతో అనుమానం వచ్చి వాహనదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫిరోజ్ గూడ కు చెందిన మసూద్ ఖాన్ గా గుర్తించి అరెస్టు చేశారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నకిలీ పోలీసులని అనుమానం వస్తే ఫిర్యాదు చేయాలని డిసిపి సూచించారు.

#sidhumaroju   

Search
Categories
Read More
Andhra Pradesh
**సాయం చేయటం మానసిక సంతృప్తి*....
ప్రెస్ నోట్ 👏✍️ *సాయం చేయటం మానసిక సంతృప్తి*.. గిద్దలూరు పురపాలక0లోని సంజీవని అనాధ...
By Chennaiah Kati 2026-02-16 12:40:46 0 69
Telangana
దస్తూరాబాద్: పాటశాలల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు
దస్తూరాబాద్ మండలంలోని ప్రభుత్వ పాటశాలలో శుక్రవారం ముందస్తు సంక్రాంతి వేడుకలను ఆయా పాఠశాల హెచ్ఎంల...
By Mitappaly Shiavji 2026-01-09 07:23:53 0 147
Andhra Pradesh
పుంగునూరు:సదుం ఎస్సై గా విష్ణు నారాయణ.
పుంగనూరు నియోజకవర్గంలోని సదుం పోలీస్ స్టేషన్ లో బుధవారం నూతన ఎస్సై విష్ణు నారాయణ తన పదవీ బాధ్యతలు...
By Kothuru Murali 2026-01-15 05:52:28 0 65
Andhra Pradesh
రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ కార్యాలయం నందు ఘనంగా సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్*
మాదిగ కార్పొరేషన్ ఆఫీస్‌లో మన డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్...
By John Baji 2025-12-24 13:13:13 0 109
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com