వాహనాలు ఆపి డబ్బులు వసూలు చేస్తున్న సూడో పోలీస్ : అరెస్ట్ చేసిన పోలీసులు.|

0
177

సికింద్రాబాద్ : బోయిన్ పల్లి పిఎస్ పరిధిలో నకిలీ పోలీసుగా చలామణి అవుతూ వాహనదారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న మసూద్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఉత్తర మండల డిసిపి రష్మీ పెరుమాళ్ తెలిపారు.నాగపూర్ జాతీయ రహదారి పక్కనే వాహనాలను ఆపి తనిఖీ చేస్తూ వాహనదారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అల్వాల్ కు చెందిన రంజన్ మాలిక్ అనే వ్యక్తి నెంబర్ ప్లేట్ లేని వాహనంపై వస్తుండగా అతన్ని ఆపినట్లు తెలిపారు. వాహనంపై చలాన్లు ఉన్నాయని 2 వేల రూపాయలు జరిమానా చెల్లించాలని డిమాండ్ చేయడంతో 400 రూపాయలు చెల్లించారు.సివిల్ దుస్తులలో ఉన్న వ్యక్తి పోలీసు అని చెప్పడంతో అనుమానం వచ్చి వాహనదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫిరోజ్ గూడ కు చెందిన మసూద్ ఖాన్ గా గుర్తించి అరెస్టు చేశారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నకిలీ పోలీసులని అనుమానం వస్తే ఫిర్యాదు చేయాలని డిసిపి సూచించారు.

#sidhumaroju   

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ.
మదనపల్లె పట్టణంలోని 35వ వార్డులో శనివారం ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది....
By Pagadala Venkateswar 2026-02-28 07:15:36 0 75
Andhra Pradesh
రేపు, ఎల్లుండి మంచినీటి సరఫరా నిలుపుదల – నగరపాలక సంస్థ ప్రకటన
అరట్లకట్ట నుంచి విక్టోరియా వాటర్ వర్క్స్ ఫిల్టరేషన్ ప్లాంట్‌కు వెళ్లే ప్రధాన...
By Ratna Sekhar 2026-02-19 19:37:30 0 446
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో పలువురు సి ఐ లు బదిలీలు.
అన్నమయ్య జిల్లాలో పలువురు సబ్-ఇన్స్పెక్టర్లు (సీఐలు) బదిలీ అయ్యారు. కర్నూల్ రేంజ్ డిఐజి కోయ...
By Pagadala Venkateswar 2026-02-10 04:26:57 0 82
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com