ఎమ్మియనూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి

0
145

మంత్రాలయం నియోజకవర్గంలోని చిలకలడోన గ్రామం సమీపంలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

దైవ దర్శనార్థం ప్రయాణిస్తున్న భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు.

ఈ ఘటన కూటమి ప్రభుత్వ పరిపాలనా వైఫల్యానికి, నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన తీవ్రంగా విమర్శించారు. రహదారి భద్రత, అత్యవసర వైద్య సదుపాయాలు, అంబులెన్స్ వ్యవస్థలను బలోపేతం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్ర‌మాద ప్రదేశాల సమీపంలో ట్రామా కేర్ సెంటర్లు, తక్షణ వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం వల్లే ప్రాణనష్టం పెరుగుతోందని ఆయన తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

క్షతగాత్రులకు తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు గౌరవప్రదమైన పరిహారం వెంటనే ప్రకటించి అందజేయాలని కూటమి ప్రభుత్వాన్ని ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు గట్టిగా డిమాండ్ చేశారు

యాత్రికులు అధికంగా ప్రయాణించే మార్గాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు, పర్యవేక్షణ వ్యవస్థలు, అత్యవసర సేవలను బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు.

ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

Search
Categories
Read More
Andhra Pradesh
జై కిసాన్ స్కీమ్ విజేతలకు బహుమతులు పంపిణీ.
మదనపల్లి: రామసముద్రం టిటిడి కళ్యాణ మండపంలో శుక్రవారం జై కిసాన్ జంక్షన్ ఆధ్వర్యంలో లక్కీ డిప్...
By Pagadala Venkateswar 2026-02-28 06:19:22 0 102
Telangana
కరీంనగర్ తెలంగాణ చౌక్ బస్టాప్ షేడ్స్ నిరుపయోగం.
కరీంనగర్ జిల్లా.  కరీంనగర్ తెలంగాణ చౌక్ లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ...
By Thalakokkula Sadanandam 2026-03-19 23:00:39 0 413
Andhra Pradesh
ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలి గద్దె అనురాధ
*ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి* *తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే...
By Rajini Kumari 2026-03-13 12:29:15 0 109
Andhra Pradesh
తస్మాత్ జాగ్రత్త ప్రజలారా??????
*💥తస్మాత్ జాగ్రత్త ప్రజలారా.....????*   హోటల్స్ కర్రి పాయింట్స్ లో కూరలు కొంటూ భోజనం...
By Rajini Kumari 2025-12-27 10:23:56 0 180
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com