TG :- DOST | దోస్త్ 2026 నోటిఫికేషన్ విడుదల ఎల్లుండి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ

0
207

DOST | రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం (2026-27)లో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీకి నిర్వహించే దోస్త్ నోటిఫికేషన్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 7వ తేదీ వరకు తొలి విడతలో సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది.అర్హులైన విద్యార్థులు రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఒక మే 14వ తేదీన తొలి దశ సీట్ల కేటాయింపు జరగనుంది. సీట్ల కేటాయింపు అనంతరం ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.ఇక రెండో దశ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 15వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు కొనసాగనుంది. మే 15వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. మే 30వ తేదీ సీట్లు కేటాయిస్తారు. మూడో విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 31వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు జరగనుంది. జూన్ 16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. జూన్ 20వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. రెండో, మూడో విడత సీట్ల కేటాయింపు అనంతరం కూడా ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో జూన్ 20 నుంచి 27వ తేదీ మధ్యలో హాజరై అడ్మిషన్ పక్రియక పూర్తి చేయాల్సి ఉంటుంది. జూన్ 29, 30వ తేదీల్లో ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూలై 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

Search
Categories
Read More
SADHANA
UPSC Prelims 2026: An Unforgiving Test of Grit
The UPSC Civil Services Preliminary Examination, held on May 24, 2026, stunned lakhs of aspirants...
By Dunna Jessicaruth 2026-05-26 08:15:09 0 418
Telangana
మంచిర్యాల్:రూ లక్ష సీఎం ఆర్ ఎఫ్ అందజేత..
హైదరాబాద్ నిమ్స్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న. మంచిర్యాల్ 32 డివిజన్b కు చెందిన చందులూరి...
By Bonagiri RaviShankar 2026-07-20 05:24:02 0 38
Andhra Pradesh
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాయచోటి టిడిపి మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం...
By Benguluri Madhubabu 2026-06-01 02:38:25 0 149
Telangana
పిడుగు పడి 2 మేకలు మృతి
జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామ శివారులో సోమవారం వర్షంతో పాటు పిడుగు పడడంతో మేకలు మృతి చెందినట్లు...
By Thativar Shivaji 2026-06-29 17:38:53 0 80
Telangana
"మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.|
హైదరాబాద్ :రాజ్యసభ ఎన్నికల నామినేషన్ తిరస్కరణ అంశంలో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్‌కు...
By Sidhu Maroju 2026-06-12 08:16:29 0 204
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com