సీఎం చంద్రబాబుతో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ భేటీ.. కీలక సమస్యలపై వినతి.

0
103

 

సీఎం చంద్రబాబుతో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ భేటీ.. కీలక సమస్యలపై వినతి

09-04-2026 Thu 07:50 | Andhra

PVN Madhav Meets CM Chandrababu on Key AP Issues

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు కీలక సమస్యలను ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒక వినతిపత్రం అందజేశారు.

 

ముఖ్యంగా నెల్లూరు, ఒంగోలు, బాపట్ల తీరప్రాంతాల్లోని మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను మాధవ్ సీఎంకు వివరించారు. పొరుగున ఉన్న తమిళనాడుకు చెందిన మత్స్యకారులు స్పీడ్ బోట్లతో ఏపీ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించి మత్స్య సంపదను దోచుకుంటున్నారని తెలిపారు. దీనివల్ల స్థానిక మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతినడంతో పాటు శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

 

అదేవిధంగా, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న హోంగార్డుల సంక్షేమం గురించి కూడా మాధవ్ ప్రస్తావించారు. మానవతా దృక్పథంతో హోంగార్డులకు అంతర్రాష్ట్ర బదిలీలు చేపట్టాలని కోరారు. ఈ సమస్య కారణంగా సుమారు 400 మంది హోంగార్డులు ఇబ్బందులు పడుతున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

 

ఈ భేటీకి సంబంధించిన వివరాలను పీవీఎన్ మాధవ్ 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన సీనియర్ సిటిజన్ కార్డులు, 'ఆయుష్మాన్ వయో వందన కార్డ్'లను పలు ప్రైవేట్ ఆసుపత్రులు అంగీకరించడం లేదని, దీనివల్ల వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని కూడా తాను సీఎంకు విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు.

 

ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, వాటిని పరిశీలించి శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

Search
Categories
Read More
Andhra Pradesh
నారాయణ పాఠశాలలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.
స్థానిక మదనపల్లి పట్టణంలోని నారాయణ పాఠశాలలో జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకలు అంగరంగ వైభవంగా...
By Pagadala Venkateswar 2026-01-26 11:58:49 0 139
Telangana
ద్విచక్ర వాహనదారుల ప్రాణరక్షణే ధ్యేయంగా తిరుమలగిరిలో హెల్మెట్ బ్యాంక్ ప్రారంభం .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తిరుమలగిరి ట్రాఫిక్ పోలీసులు ఒక...
By Sidhu Maroju 2026-03-06 11:15:19 0 118
Andhra Pradesh
సంక్రాంతి సంబరాలు లో పాల్గొన్న సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు రాయచోటి మానస పేటలో సంక్రాంతి సంబరాలు లో పాల్గొన్న రాజంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు...
By Benguluri Madhubabu 2026-01-16 13:08:38 0 285
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com