శ్రీగణేష్ జోక్యంతో సద్దుమణిగిన అంబేద్కర్ విగ్రహ వివాదం.|

0
167

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మారేడ్‌పల్లి వాల్మీకి నగర్‌లో అంబేద్కర్ విగ్రహంపై నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు చివరికి శాంతి నెలకొంది. ఈ వివాదాన్ని సునాయాసంగా పరిష్కరించడంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ కీలక పాత్ర పోషించారు.

ఇటీవల అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్ ఎదుట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించగా, కంటోన్మెంట్ బోర్డు అధికారులు దానిని తొలగించడంతో స్థానికంగా ఉద్రిక్తతలు చెలరేగాయి. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీగణేష్ వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి ముందుకు వచ్చారు.

సోమవారం కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేదిని ప్రత్యక్షంగా కలసిన ఎమ్మెల్యే, విగ్రహాన్ని తిరిగి యథాస్థానంలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన సీఈఓ, విగ్రహ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. అదే సమయంలో పోలీస్ ఉన్నతాధికారులతో కూడా ఎమ్మెల్యే సమన్వయం సాధించి, పరిస్థితులను చక్కదిద్దారు.

ఎమ్మెల్యే సూచనల మేరకు పోలీస్ మరియు కంటోన్మెంట్ అధికారులు కలిసి విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించే దిశగా చర్యలు చేపట్టడంతో వివాదానికి పూర్తిగా తెరపడింది. ఈ పరిణామంతో యువజన, దళిత సంఘాల సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే శ్రీగణేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

బాబాసాహెబ్ అంబేద్కర్ గౌరవం దెబ్బతినకుండా చూడాలనే లక్ష్యంతోనే తాను స్వయంగా రంగంలోకి దిగానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించిన ఆయన చర్యలు స్థానికంగా ప్రశంసలు అందుకుంటున్నాయి.

#Sidhumaroju

Search
Categories
Read More
West Bengal
Malda Division Gets ₹274 Cr Railway Signalling Upgrade
In a major move to enhance passenger safety and operational efficiency, the Indian Railways has...
By Lokeshwari Panthadi 2026-07-03 05:05:18 0 62
Andhra Pradesh
పూనూరు నియోజకవర్గం :సదుం పోలీస్ స్టేషను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఎస్పి
పుంగనూరు నియోజకవర్గం, సదుం పోలీస్ స్టేషను డీఎస్పీ మహేంద్ర బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి,...
By Kothuru Murali 2026-02-05 03:33:01 0 173
Uttar Pradesh
Prayagraj’s Mega Bridge: Solving City Traffic Woes
Prayagraj is on the cusp of a major infrastructure breakthrough with the near-completion of its...
By Lokeshwari Panthadi 2026-06-29 08:38:35 0 58
Telangana
"బండి-ఈటల విభేదాలకు ముగింపు".|
- కోల్డ్ వార్‌కు తెరదించిన బీజేపీ అధిష్టానం - అభయ్ పాటిల్ సమక్షంలో ఆలింగనం చేసుకున్న నేతలు...
By Sidhu Maroju 2026-07-18 13:50:53 0 81
Telangana
ఎస్సై కి ఆహ్వానం పలికిన హనుమాన్ స్వాములు
​కొత్తగూడ, ఏప్రిల్ 17,మహబూబాబాద్ జిల్లా: కొత్తగూడ మండల కేంద్రంలో హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో...
By Bheeshman King 2026-04-17 13:55:08 0 848
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com