హార్మూస్ జల సంధిలో తీవ్ర ఉద్రిక్తతచుట్టుముట్టిన అమెరికా

0
109

Iran

 

    *హర్మూజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తత.. ఇరాన్‌ను చుట్టుముట్టిన అమెరికా* 

 

ఇరాన్‌తో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ ఓడరేవులపై పూర్తిస్థాయి దిగ్బంధనాన్ని (blockade) అమలు చేయనున్నట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకటించింది. సోమవారం, ఏప్రిల్ 13న తూర్పు కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల నుంచి (భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30) ఈ దిగ్బంధనం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

 

ఇరాన్‌కు చెందిన అరేబియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లోని తీర ప్రాంతాలు, ఓడరేవులకు వచ్చే లేదా వెళ్లే ఏ దేశ నౌకనైనా అడ్డుకుంటామని సెంట్రల్ కమాండ్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది. అయితే, హర్మూజ్ జలసంధి గుండా ఇతర దేశాల ఓడరేవులకు వెళ్లే నౌకల స్వేచ్ఛకు ఎలాంటి ఆటంకం కలిగించబోమని స్పష్టం చేసింది. అమెరికా ఆంక్షలను తప్పించుకుంటూ చైనా యువాన్ల రూపంలో చెల్లింపులు జరుపుతున్న నౌకలను నిరోధించడమే ఈ దిగ్బంధనం వెనుక అసలు ఉద్దేశమని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

అమెరికా దిగ్బంధనంపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఖలీబాఫ్ తీవ్రంగా స్పందించారు. ఈ చర్యతో అమెరికా వినియోగదారులకు ఇంధన ధరలు భారీగా పెరగనున్నాయని డొనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించారు. "ప్రస్తుత పంపు ధరలను ఆస్వాదించండి. మా దిగ్బంధనంతో త్వరలోనే మీరు 4-5 డాలర్ల గ్యాస్ ధరలను గుర్తుచేసుకుని బాధపడతారు" అని ఆయన ఎక్స్‌లో వ్యంగ్యంగా పోస్ట్ చేశారు.

 

ఇదిలావుండగా, ఇటీవల హర్మూజ్ జలసంధిలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. తమ హెచ్చరికలతో రెండు అమెరికా యుద్ధనౌకలను వెనక్కి పంపించామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. అయితే ఈ వాదనను యూఎస్ సెంట్రల్ కమాండ్ ఖండించింది. తమ యుద్ధనౌకలు ఎలాంటి ఆటంకాలు లేకుండా తమ ప్రయాణాన్ని పూర్తి చేశాయని తెలిపింది. ఈ తాజా దిగ్బంధనం ఇరాన్, చైనాలతో అమెరికాకు ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచింది. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హర్మూజ్ జలసంధిలో అంతరాయం ఏర్పడితే, ముడిచమురు ధరలు పెరిగి ప్రపంచ ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

Search
Categories
Read More
SURAKSHA
Bangalore Police Today: Service Beyond Duty Hours
: Bangalore Police officers once again proved humanity today. In Majestic and suburban areas,...
By Kalaga Sailaja 2026-07-06 06:29:04 0 133
Andhra Pradesh
వృద్ధురాలు మిస్సింగ్
చిత్తూరు జిల్లా, పుంగునూరు నియోజకవర్గం, సోమల మండలం, గన్నవారిపల్లె గ్రామానికి చెందిన 84 ఏళ్ల దాసరి...
By Kothuru Murali 2026-01-02 04:53:33 0 201
Telangana
నిజామాబాద్.:కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పును హర్షించిన మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల...
తేదీ:23.04.2026. నిజామాబాద్.కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పును హర్షించిన మాజీ ఎమ్మెల్యే...
By Sadaq Sadaq 2026-04-23 07:45:58 1 384
Andhra Pradesh
ఇంద్రకీలాతి కేశఖండనశాల వేలం ప్రక్రియ పూర్తి 80% మేరకు పెరిగిన ఆదాయం
*ఇంద్రకీలాద్రిపై కేశఖండన శాల వెంట్రుకల వేలం ప్రక్రియ పూర్తి* – *సుమారు 80% మేర పెరిగిన...
By Rajini Kumari 2025-12-29 13:18:43 0 178
SURAKSHA
Alok Kumar, IPS: A Visionary Leader in Modern Policing
A distinguished 1994-batch IPS officer whose commitment to technology-driven policing, public...
By Lokeshwari Panthadi 2026-07-18 11:31:39 0 54
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com