కార్యకుల సమ్మెతో పోర్టులో నిలిచిపోయిన కార్యకలాపాలు – చట్టాల మార్పుపై ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన

0
204

కాకినాడ: నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కేంద్ర కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె ప్రభావంతో కాకినాడ సముద్ర పోర్టులో కార్యకలాపాలు నిలిచిపోయాయి. కార్మికుల పోరుకు మద్దతుగా కార్మిక సంఘాల నాయకులు ఆందోళనలు నిర్వహించారు. సముద్ర పోర్టులో కార్గో లోడింగ్, అన్‌లోడింగ్ కార్యకలాపాలు ఆగిపోయినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ నాలుగు లేబర్ కోడ్‌లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్మికుల హక్కులను కాలరాసేలా ఈ కోడ్‌లు ఉన్నాయని, వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్ళారి కృష్ణమోహన్ డిమాండ్ చేశారు. వేతన సమరక్షణ, పని గంటల పెంపు, ఈపీఎఫ్, బోనస్ వంటి అంశాల్లో కార్మికులకు తుంగలో తొక్కేలా లేబర్ కోడ్ ఉందని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కాకినాడ జిల్లా కన్వీనర్ నరాల శివ అన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ రియాజ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
​'Pink Patrol' for Women's Safety
​Content: To ensure the security of women, the state has deployed 'Pink Patrol' teams. These...
By Kalaga Sailaja 2026-06-29 10:10:58 0 105
Andhra Pradesh
Renew global energy inauguration
రీన్యూ ఎనర్జీ గ్లోబల్ (ReNew) సంస్థ అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ. 5,400 కోట్ల పెట్టుబడితో...
By G k Nookala 2026-04-23 04:58:38 0 149
Telangana
మద్దూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 
భారత్ అవాజ్  మద్దూర్ మండల్ రిపోర్టర్    సూర్యమోహన్    మద్దూరు...
By Vanmoj Suryamohan 2026-03-23 12:33:07 0 350
Telangana
కేసీఆర్ సంచలన నిర్ణయం! BRS పార్టీ రీస్ట్రక్చర్ – KTRకి ఫుల్ బాధ్యతలు
తెలంగాణ రాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ‎K. Chandrashekar Rao కీలక నిర్ణయం...
By Ponnala Srinivasrao 2026-04-29 02:02:14 0 114
Andhra Pradesh
మదనపల్లిలో మృతురాలి ఆచూకీ లభ్యం.
మదనపల్లె పట్టణంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గుర్తు తెలియని మహిళను స్థానిక...
By Pagadala Venkateswar 2026-01-27 06:53:45 0 169
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com