*_కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు._*

0
150

_ఆయన అధికారంలో లేకపోవచ్చు.. కానీ ఆయన మాటకు ఉన్న పవర్ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపితమైంది. గులాబీ దళపతి, మాజీ సీఎం కేసీఆర్ ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు.._పనులు పరుగులు పెడతాయని సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ సాక్షిగా తేలిపోయింది. "సారు ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు" అని విమర్శించే ప్రత్యర్థులకు, "ఆయన ఎక్కడున్నా శాసించగలరు" అని కేసీఆర్ తన స్టైల్‌లో సమాధానమిచ్చారు._

‎_సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని కొట్యాల, అల్లీనగర్, అడవి మజీద్, క్షీరసాగర్ వంటి గ్రామాల్లో వందలాది ఎకరాల పంట పొలాలు నీరు లేక కళ్లముందే ఎండిపోతున్నాయి. కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి, ఆలేరు కాలువలకు నీటిని వదులుతున్నా.. తమ గ్రామాల కాలువలకు మాత్రం నీరు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో, విసిగిపోయిన రైతులు డీసీసీబీ మాజీ డైరెక్టర్ అంజిరెడ్డిని ఆశ్రయించారు._

‎_రైతుల కష్టాన్ని విన్న అంజిరెడ్డి నేరుగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న కేసీఆర్‌ను కలిశారు. ఎండిపోతున్న పంటల ఫోటోలను చూసిన కేసీఆర్, క్షణం కూడా ఆలస్యం చేయకుండా నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులకు ఫోన్ చేశారు. "రైతు కంట కన్నీరు రాకూడదు.. పంటలు ఎండిపోతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? వెంటనే నీటిని విడుదల చేయండి" అంటూ తనదైన శైలిలో సూచించారు._

‎*_హుటాహుటిన పరుగులు పెట్టిన యంత్రాంగం!_*

‎_ఆశ్చర్యకరంగా.. కేసీఆర్ ఫోన్ చేసిన కాసేపటికే అధికార యంత్రాంగంలో చలనం వచ్చింది. అప్పటివరకు సవాలక్ష కారణాలు చెప్పిన అధికారులు, మాజీ సీఎం ఆదేశాలతో వెంటనే అలర్ట్ అయ్యారు. హుటాహుటిన కొండపోచమ్మ సాగర్ నుంచి కాలువలకు నీటిని విడుదల చేశారు. కాలువల్లో నీరు ఉరకలెత్తుతుంటే రైతుల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది._

‎*_సోషల్ మీడియాలో వైరల్:_*

‎_ఈ ఘటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అధికారంలో లేకపోయినా కేసీఆర్ ఒక ఫోన్ కాల్‌తో యంత్రాంగాన్ని పరుగులు పెట్టించడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "సీఎం సీటులో ఉన్నా లేకున్నా.. కేసీఆర్ క్రేజ్ వేరు" అంటూ ఆయన అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఫామ్ హౌస్ నుంచే పాలనను శాసించగల సత్తా ఆయనకు ఉందని ఈ ఘటనతో మరోసారి స్పష్టమైంది. తమ పంటలను కాపాడిన కేసీఆర్‌కు ఆయా గ్రామాల రైతులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నారు._

 

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న హరిప్రసాద్ ను మదనపల్లె డిసిఆర్బికి బదిలీ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న హరిప్రసాద్ ను మదనపల్లె...
By Kothuru Murali 2026-01-10 10:18:20 0 170
Business & Finance
Meghalaya Tourism Gears Up for Monsoon Visitors
Tourism stakeholders in Meghalaya are strengthening safety measures and upgrading visitor...
By Navya Sree 2026-07-02 07:49:45 0 47
Business & Finance
Legal Services That Protect Your Business Interests
Professional legal services help businesses stay compliant with laws, manage documentation, and...
By Navya Sree 2026-07-14 07:22:30 0 62
Andhra Pradesh
ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కార్పొరేటర్లకు భూముల పందారంపై ఉద్యమం కొనసాగిస్తాం
*⭐లులు కంపెనీకి విజయవాడ లో ఆర్టీసీ స్థలం కేటాయింపు రద్దు, ప్రజాపోరాట విజయం*   *⭐ప్రభుత్వ...
By Rajini Kumari 2026-04-10 06:39:07 0 130
Telangana
హెచ్‌సీఏలో ‘విశాఖ’ సెగ: రూ. 70 కోట్ల చెల్లింపులపై జింఖానాలో రచ్చ!
హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో అవినీతి ఆరోపణలు మరోసారి ప్రకంపనలు...
By Sidhu Maroju 2026-03-03 13:56:18 0 175
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com