*_కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు._*

0
105

_ఆయన అధికారంలో లేకపోవచ్చు.. కానీ ఆయన మాటకు ఉన్న పవర్ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపితమైంది. గులాబీ దళపతి, మాజీ సీఎం కేసీఆర్ ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు.._పనులు పరుగులు పెడతాయని సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ సాక్షిగా తేలిపోయింది. "సారు ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు" అని విమర్శించే ప్రత్యర్థులకు, "ఆయన ఎక్కడున్నా శాసించగలరు" అని కేసీఆర్ తన స్టైల్‌లో సమాధానమిచ్చారు._

‎_సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని కొట్యాల, అల్లీనగర్, అడవి మజీద్, క్షీరసాగర్ వంటి గ్రామాల్లో వందలాది ఎకరాల పంట పొలాలు నీరు లేక కళ్లముందే ఎండిపోతున్నాయి. కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి, ఆలేరు కాలువలకు నీటిని వదులుతున్నా.. తమ గ్రామాల కాలువలకు మాత్రం నీరు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో, విసిగిపోయిన రైతులు డీసీసీబీ మాజీ డైరెక్టర్ అంజిరెడ్డిని ఆశ్రయించారు._

‎_రైతుల కష్టాన్ని విన్న అంజిరెడ్డి నేరుగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న కేసీఆర్‌ను కలిశారు. ఎండిపోతున్న పంటల ఫోటోలను చూసిన కేసీఆర్, క్షణం కూడా ఆలస్యం చేయకుండా నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులకు ఫోన్ చేశారు. "రైతు కంట కన్నీరు రాకూడదు.. పంటలు ఎండిపోతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? వెంటనే నీటిని విడుదల చేయండి" అంటూ తనదైన శైలిలో సూచించారు._

‎*_హుటాహుటిన పరుగులు పెట్టిన యంత్రాంగం!_*

‎_ఆశ్చర్యకరంగా.. కేసీఆర్ ఫోన్ చేసిన కాసేపటికే అధికార యంత్రాంగంలో చలనం వచ్చింది. అప్పటివరకు సవాలక్ష కారణాలు చెప్పిన అధికారులు, మాజీ సీఎం ఆదేశాలతో వెంటనే అలర్ట్ అయ్యారు. హుటాహుటిన కొండపోచమ్మ సాగర్ నుంచి కాలువలకు నీటిని విడుదల చేశారు. కాలువల్లో నీరు ఉరకలెత్తుతుంటే రైతుల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది._

‎*_సోషల్ మీడియాలో వైరల్:_*

‎_ఈ ఘటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అధికారంలో లేకపోయినా కేసీఆర్ ఒక ఫోన్ కాల్‌తో యంత్రాంగాన్ని పరుగులు పెట్టించడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "సీఎం సీటులో ఉన్నా లేకున్నా.. కేసీఆర్ క్రేజ్ వేరు" అంటూ ఆయన అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఫామ్ హౌస్ నుంచే పాలనను శాసించగల సత్తా ఆయనకు ఉందని ఈ ఘటనతో మరోసారి స్పష్టమైంది. తమ పంటలను కాపాడిన కేసీఆర్‌కు ఆయా గ్రామాల రైతులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నారు._

 

Search
Categories
Read More
Andhra Pradesh
సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఏరియల్ వ్యూ పరిశీలన
సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఏరియల్ వ్యూ పరిశీలన   బాపట్ల:...
By Gadiyapudi Narendra 2026-01-12 16:55:21 1 531
Andhra Pradesh
మదనపల్లి : మద్యం దుకాణంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తనిఖీ.
మదనపల్లెలో శుక్రవారం ఎక్సైజ్ పోలీసులు పలు మద్యం దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎక్సైజ్...
By Pagadala Venkateswar 2026-04-18 03:51:05 0 62
Telangana
మేడ్చల్ జిల్లా కలెక్టరు గా మిక్కిలినేని మను చౌదరి గారు బాధ్యతలు చేపట్టారు
మేడ్చల్ జిల్లా కలెక్టర్ గా మిక్కిలినేని మను చౌదరి గారు నియమితులయ్యారు. ఇంతకుముందు మేడ్చల్...
By Vadla Egonda 2025-06-13 03:00:16 0 2K
Maharashtra
Justice for Street Vendors: Bombay High Court Slams Nagpur Civic Body for Illegal Evictions
Nagpur | July 2025 - In a significant move upholding the rights of street vendors, the Bombay...
By Citizen Rights Council 2025-08-02 10:18:55 0 2K
Telangana
సికింద్రాబాద్ లో గంజాయి ముఠా గుట్టురట్టు : అల్వాల్ డెలివరీ బాయ్ తో సహా ఏడుగురు అరెస్ట్.|
  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : నగరంలో మాదకద్రవ్యాల విక్రయాలే లక్ష్యంగా సాగుతున్న అక్రమ...
By Sidhu Maroju 2026-03-12 11:19:07 0 132
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com