ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో : మంచిర్యాల మేయర్, డిప్యూటీ మేయర్లు

0
150

మంచిర్యాల గౌరవ శాసన సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లుపథకం ద్వారా మంచిర్యాల నియోజక వర్గం,మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38 వ డివిజన్ లో లబ్ధి దారులైన కామెర స్నిగ్ధ కిరణ్ కుమార్ పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇళ్ళు గృహ ప్రవేశ మహోత్సవానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల *మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ డిప్యూటీ మేయర్ శ్రీమతి సళ్ళ రమ్య మహేష్ కలిసి నూతన గృహన్ని ప్రారంభించడం జరిగింది లబ్ధి దారులకు మేయర్ శుభాకాంక్షలు తెలియచేశారు.ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశానికి విచ్చేసిన మేయర్ని లబ్ధిదారులు మర్యాదపూర్వకంగా శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో స్థానిక 38 వ డివిజన్ కార్పొరేటర్ పుదరి విజయ రాణి ,39 వ డివిజన్ కార్పొరేటర్ పుదరి సునీత ప్రభాకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పుదరి తిరుపతి ,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సళ్ళ మహేష్ ,హౌసింగ్ బోర్డు అధికారులు, కాంగ్రెస్ పార్టీనాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు,స్థానిక ప్రజలు పాల్గొన్నారు 

Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com