నేడు ఏపీ కేబినెట్ భేటీ ..ఈ కీలక అంశాలపై చర్చ.

0
112

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్రానికి పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతి సహా పలు కీలక అంశాలపై చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేలా సుమారు రూ.39,436 కోట్ల విలువైన పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలవనుంది.

 

రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన 31 ప్రాజెక్టులకు కేబినెట్ లాంఛనంగా ఆమోదముద్ర వేయనుంది. వీటితో పాటు, విద్యా రంగంలో ఫీజుల నియంత్రణ కోసం ఫీజు రెగ్యులేటరీ కమిటీ (ఎఫ్ఆర్‌సీ) ఏర్పాటుకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అమరావతిలో ఏర్పాటు చేయనున్న ‘క్వాంటమ్ వ్యాలీ’లో మూడు సంస్థల స్థాపనపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది.

 

రాజధాని అమరావతి నిర్మాణం, వివిధ సంస్థలకు భూముల కేటాయింపులపై కూడా సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం 28 జిల్లాలకు కొత్త జోనల్ వ్యవస్థను ఖరారు చేసే అంశం కూడా ఎజెండాలో ఉంది. భవిష్యత్తులో ఉద్యోగ నియామకాలు, బదిలీలు ఈ కొత్త విధానంలోనే జరగనున్నాయి. అమరావతికి రాజధాని హోదా కల్పిస్తూ పార్లమెంట్‌లో చట్టం చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతూ కేబినెట్ తీర్మానం చేసే అవకాశం ఉంది.

 

కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం, ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో రాజకీయ అంశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రజల్లోకి వెళ్లాల్సిన వ్యూహంపై ఆయన దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.

Search
Categories
Read More
Andhra Pradesh
రెడ్డి కమ్యూనిటీ హాల్ స్థలాన్ని పరిశీలించిన బివి జగనేశ్వర్ రెడ్డి
_*రెడ్డి జనసంఘం కమ్యూనిటీ కన్వెన్షన్ హాల్ స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ...
By Boya Dasthagiri 2026-03-25 06:11:26 0 328
Andhra Pradesh
జనసేన పార్టీ కువైట్ ఆధ్వర్యంలో ఆత్మీయ విందు కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగ వాసి ప్రసాద్ బాబు
కువైట్ జనసేన పార్టీ కువైట్ కార్యవర్గం ఏర్పాటుచేసిన జనసేన పార్టీ కువైట్ ఎన్నారై టిడిపి కువైట్...
By Benguluri Madhubabu 2026-05-16 12:01:57 0 243
Telangana
నేటి నుంచి పాన్ కార్డ్స్‌ రూల్స్‌ మార్పు
నేటి నుంచి పాన్ కార్డ్స్‌ రూల్స్‌ మార్పు దేశంలో ఆర్థిక లావాదేవీల పారదర్శకతను పెంచే...
By Pinnehasan Odela 2026-04-01 07:09:46 0 157
Telangana
హైదరాబాద్ జూపార్క్ లోని ఆడపులికి క్లీంకార పేరు.
జూపార్క్ బృందానికి ధన్యవాదాలు తెలిపిన ఉపాసన
By Sidhu Maroju 2025-06-20 16:34:07 0 1K
Andhra Pradesh
అక్కడ మృతి చెందిన విద్యార్థిది పుంగనూరు మండలం
పుంగనూరు మండలం మంగళం గ్రామానికి చెందిన 22 ఏళ్ల భావన, రంగంపేటలోని ఓ కాలేజీలో బిటెక్ ఫైనల్ ఇయర్...
By Kothuru Murali 2026-02-25 09:42:01 1 203
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com