తల్లి సురక్షితం.. రాష్ట్రం సుభిక్షం..: దామోదర రాజనర్సింహ.|

0
225

సికింద్రాబాద్ : మాతృత్వం అనేది ప్రతి మహిళకు లభించే గొప్ప వరమని, తల్లి-బిడ్డలు సురక్షితంగా ఉంటేనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ముందుకు సాగుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బోయగూడాలోని మిడ్ వైఫరీ శిక్షణ సంస్థలో నిర్వహించిన సురక్షిత మాతృత్వ దినోత్సవం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా “అనీమియా ముక్త్ భారత్” పోస్టర్‌ను ఆవిష్కరించారు.

అనంతరం కుటుంబ నియంత్రణ, జాతీయ పోషకాహార విలువలు, గర్భిణీ స్త్రీలకు అందించే పౌష్టికాహారం, శిశు సంరక్షణపై ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.

మంత్రి మాట్లాడుతూ...తెలంగాణ ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా తల్లి, బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని స్పష్టం చేశారు. మిడ్ వైఫరీ విధానాన్ని మరింత బలోపేతం చేసి గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో మాతా-శిశు సంరక్షణ కేంద్రాలను పెంచి, వారికి మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

మిడ్ వైఫరీ శిక్షణ సంస్థలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, మిడ్ వైఫరీల సంఖ్య పెరిగితే శిశు మరణాలు గణనీయంగా తగ్గుతాయని చెప్పారు. గత రెండేళ్లలో 7 వేలకుపైగా నర్సులను నియమించామని వెల్లడించారు.

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
గవరమ్మపేట పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచారం
గవరమ్మపేట గ్రామ పరిసరాల్లో గురువారం ఉదయం ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు...
By Boiena Rajesh 2026-04-02 05:17:55 0 202
Madhya Pradesh
Madhya Pradesh Expands Infrastructure and Connectivity
Madhya Pradesh continues to accelerate infrastructure development by expanding highways,...
By Fathima Safa 2026-07-06 08:00:23 0 63
SURAKSHA
V. P. Gautham IAS: Leading Development with Vision
A dynamic Telangana IAS officer known for innovative governance, tribal development, urban...
By Lokeshwari Panthadi 2026-07-15 11:14:45 0 110
Andhra Pradesh
గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి నా అజెండా ఎర్రగడ్డ వెంకట్రావు
*గన్నవరం నియోజక వర్గ అభివృద్ధియే నా అజెండా: యార్లగడ్డ వెంకట్రావు*   గన్నవరం నియోజకవర్గ...
By Rajini Kumari 2026-01-04 11:12:58 0 232
Andhra Pradesh
పుంగనూరులో వ్యక్తిపై కేసు నమోదు: ఎస్సై
పుంగనూరు పట్టణంలో బోండాలు, బజ్జీలు అమ్ముకునే మహిళను తోఎన్ఎస్ పేటకి చెందిన అబ్రార్ పరిచయం...
By Kothuru Murali 2026-04-30 11:43:36 0 98
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com