తల్లి సురక్షితం.. రాష్ట్రం సుభిక్షం..: దామోదర రాజనర్సింహ.|

0
227

సికింద్రాబాద్ : మాతృత్వం అనేది ప్రతి మహిళకు లభించే గొప్ప వరమని, తల్లి-బిడ్డలు సురక్షితంగా ఉంటేనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ముందుకు సాగుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బోయగూడాలోని మిడ్ వైఫరీ శిక్షణ సంస్థలో నిర్వహించిన సురక్షిత మాతృత్వ దినోత్సవం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా “అనీమియా ముక్త్ భారత్” పోస్టర్‌ను ఆవిష్కరించారు.

అనంతరం కుటుంబ నియంత్రణ, జాతీయ పోషకాహార విలువలు, గర్భిణీ స్త్రీలకు అందించే పౌష్టికాహారం, శిశు సంరక్షణపై ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.

మంత్రి మాట్లాడుతూ...తెలంగాణ ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా తల్లి, బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని స్పష్టం చేశారు. మిడ్ వైఫరీ విధానాన్ని మరింత బలోపేతం చేసి గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో మాతా-శిశు సంరక్షణ కేంద్రాలను పెంచి, వారికి మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

మిడ్ వైఫరీ శిక్షణ సంస్థలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, మిడ్ వైఫరీల సంఖ్య పెరిగితే శిశు మరణాలు గణనీయంగా తగ్గుతాయని చెప్పారు. గత రెండేళ్లలో 7 వేలకుపైగా నర్సులను నియమించామని వెల్లడించారు.

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Telangana
ప్రభుత్వా పణితీరుతో రియల్ ఎస్టేట్ డమాల్ బిల్డర్ బెజార్
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని విధానాలు తెస్తున్నా ప్రజలు...
By Ponnala Srinivasrao 2026-02-28 13:15:09 0 442
Dadra &Nager Haveli, Daman &Diu
DNHDD Expands Digital Governance and Public Services
Dadra & Nagar Haveli and Daman & Diu continue to advance digital governance by expanding...
By Fathima Safa 2026-07-06 06:18:07 0 67
Andhra Pradesh
Matsyakarula seva padakkam
వేట నిషేధ సమయంలో మత్య్సకారులకు రూ.20 వేలు ఆర్థికసాయం ఇస్తామన్న హామీ ప్రకారం... ‘మత్స్యకారుల...
By G k Nookala 2026-05-18 13:01:07 0 140
Andhra Pradesh
పామ్ ఆయిల్ సాగు చరిత్రలో ఏపీలోనే అధిక ధర
*Press Release*     *పామాయిల్ సాగు చరిత్రలో తొలిసారి తెలంగాణకన్నా ఏపీలోనే అధిక ధర*...
By Rajini Kumari 2026-02-06 09:42:44 0 183
SURAKSHA
​సైబర్ నేరాల నివారణపై అవగాహన సదస్సు
​ఆర్టికల్: సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో, తెలంగాణ పోలీసులు నిన్న పలు ప్రాంతాల్లో ప్రత్యేక...
By Kalaga Sailaja 2026-06-27 04:54:59 0 42
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com