ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతు : రాష్ట్ర ఉపాధ్యక్షుడు కామ్రేడ్ భూపాల్

0
237

మంచిర్యాల నియోజకవర్గం : శ్రీరాంపూర్ ఏరియాలో జరిగిన సమావేశంలో ,ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు సీఐటీయు సంపూర్ణ మద్దతు తెలియచేస్తుందని ,రాజ్యాంగ పరిరక్షణ - సవాళ్ళు అనే అంశంపై జరిగే సెమినార్ ను జయప్రదం చేయగలరని ,సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్ తెలిపారు జిల్లా కమిటీ సమావేశం బుధవారం రోజున జరిగింది, ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్  మాట్లాడుతూ కులం, మతం, ప్రాంతం, లింగ బేధం లాంటి సామాజిక అంశాలు మన దేశంలో ప్రజల్ని, కార్మికవర్గాన్ని ఐక్యం కానివ్వకుండా ఆటంకంగా వున్నాయి. కార్మికవర్గంలో సున్నితమైన ఈ అంశాలను దోపిడీ వర్గాల ప్రయోజనాల కోసం పాలక వర్గాలు ముందుకు తెస్తూ కార్మికవర్గ ఐక్యతను విచ్ఛిన్నం చేసి దోపిడీ వర్గాలు తమ ప్రయోజనాలను కాపాడుకుంటున్నయాన్నారు. అన్నిరకాల దోపిడీ, అణచివేత, వివక్షలకు వ్యతిరేకంగా పోరాడి వీటి నుండి శ్రామిక వర్గాన్ని విముక్తి చేసి, పెట్టుబడిదారీ సమాజానికి ప్రత్యామ్నాయంగా కార్మికవర్గ రాజ్యాన్ని స్థాపించాలనే లక్ష్యంతో సిఐటియు పని చేస్తున్నది.ఏప్రిల్ 6 సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ బి.టి. రణదివే వర్థంతి నుండి ఏప్రిల్ 15 వరకు తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయ సాధన క్యాంపెయిన్ నిర్వహించాలని సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈ క్యాంపెయిన్ లో సిఐటియు అనుబంధ సంఘాలన్నీ భాగస్వాములు కావాలని, రాష్ట్ర కార్మికవర్గంలో సామాజిక న్యాయ సాధన క్యాంపెయిన్ను విజయవంతం చేయాలని సిఐటియు పిలుపునిస్తున్నది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థలో పని చేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగ కార్మికులు చేస్తున్న ఆందోళన పోరాటానికి సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది.ఈ క్యాంపెయిన్ లో భాగంగా ఏప్రిల్ 8,9,10 వ తేదీలల్లో సామాజిక ఉద్యమ నిధిని కార్మికుల నుండి వసూలు చేయాలని, ఈ కార్యక్రమంలో అన్ని స్థాయిల్లోని సిఐటియు యంత్రాంగం పాల్గొనాలని కోరుతున్నది. కార్మికులు, ఉద్యోగులు సామాజిక న్యాయ సాధన క్యాంపెయిన్ పాల్గొని, సామాజిక సంఘీభావ ఉద్యమ నిధికి విరివిగా విరాళాలు అందించాలని కోరారు ,సామాజిక న్యాయ సాధన క్యాంపెయిన్ సందర్భంగా జిల్లా కేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ సవాళ్ళు అనే అంశంపై ఏప్రిల్ 11వ తేదీన సెమినార్ నిర్వహించడం జరుగుతుంది, ఈ సెమినార్లో జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలన్నారు,ఈ సమావేశంలో సంకె రవి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, సాంబారి వెంకటస్వామి జిల్లా సహాయ కార్యదర్శి , జిల్లా కమిటీ సభ్యులు పద్మావతి,ప్రకాష్, లక్ష్మణ్,దేవదాసు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Business & Finance
Kanpur–Kabrai Greenfield Highway Project Approved
The Union Cabinet has approved the Kanpur–Kabrai access-controlled highway as part of...
By Navya Sree 2026-07-04 07:16:43 0 49
Andhra Pradesh
ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేసిన కలెక్టర్.
మదనపల్లి మండలం కొండామర్రిపల్లిలో శనివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో...
By Pagadala Venkateswar 2026-02-01 08:04:06 0 152
Andhra Pradesh
అంటువ్యాధుల నియంత్రణను రాష్ట్రస్థాయి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు
అంటువ్యాధుల నియంత్రణకు రాష్ట్ర స్థాయి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు    ...
By Rajini Kumari 2025-12-29 13:11:37 0 180
Andhra Pradesh
కాకినాడ: ఎమ్మెల్సీ అనంత బాబు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు కష్టాలు మరింత పెరుగుతున్నాయి. కూటమి...
By Ratna Sekhar 2026-02-19 20:17:49 0 1K
Telangana
ఖాకీల "సైబర్ వసూళ్లు" ఎల్బీనగర్ చౌరస్తాలో ఏసీబీ అధికారుల మెరుపు దాడి -ఇద్దరు పోలీసుల అరెస్టు .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : (ఎల్బీనగర్) లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఇద్దరు రిజర్వ్ సబ్...
By Sidhu Maroju 2026-03-09 12:46:14 0 168
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com