ఖాకీల "సైబర్ వసూళ్లు" ఎల్బీనగర్ చౌరస్తాలో ఏసీబీ అధికారుల మెరుపు దాడి -ఇద్దరు పోలీసుల అరెస్టు .|

0
168

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : (ఎల్బీనగర్) లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఇద్దరు రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు (RSIs) ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. 

మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఆర్‌ఎస్‌ఐలు ప్రమోద్ కుమార్ గౌడ్, జటావత్ బాబు నాయక్ ఒక సైబర్ క్రైమ్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు (నోటీసు ఇచ్చేందుకు) లక్ష రూపాయలు డిమాండ్ చేశారు.

బాధితుడు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన ఏసీబీ రేంజ్-2 అధికారులు పథకం ప్రకారం ఎల్బీనగర్ చౌరస్తాలో మాటు వేశారు.

లంచం డబ్బులు తీసుకుంటుండగా ఇద్దరు అధికారులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద నుండి లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని, అదుపులోకి తీసుకున్నారు. 

ఈ ఘటన స్థానికంగా పోలీసు వర్గాల్లో సంచలనం సృష్టించింది. నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.

 

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Business & Finance
June GST Growth Supports Arunachal's Development
India's Goods and Services Tax (GST) collections increased 13.9% year-on-year to ₹1.94 lakh crore...
By Navya Sree 2026-07-02 12:54:27 0 63
Andhra Pradesh
జెన్ జెడ్ పోస్ట్ ఆఫీసు ప్రారంభం
కర్నూలు! కర్నూలు ధూపాడు సమీపంలో గల కెవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో జన్ జెడ్ పేరుతో...
By Hari Krishna 2025-12-12 09:48:30 2 2K
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు కిక్కెక్కించాయి. నూతన సంవత్సర.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు కిక్కెక్కించాయి. నూతన సంవత్సర వేడుకలతో...
By John Baji 2026-01-02 12:46:13 0 195
Telangana
భద్రాచలంలో కొనసాగుతున్న బంద్: బస్టాండ్ వద్ద నిలిచిపోయిన రాకపోకలు
భద్రాచలం: రాష్ట్రవ్యాప్త బంద్ పిలుపులో భాగంగా ఈరోజు భద్రాచలం పట్టణంలో బంద్ ప్రశాంతంగా, అయితే...
By Lakavath Kiran 2026-04-22 01:42:19 0 416
Kerala
Kerala Private Bus Operators to Strike from July 22
Negotiations between Kerala’s private bus operators and the Transport Ministry have...
By Bharat Aawaz 2025-07-17 06:51:41 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com