గోనెగండ్ల మండలం అగ్రహారం గ్రామంలో మంచినీరు సరఫరా

0
67

శ్రీ శ్రీ శ్రీ ధర్గమ్మ దేవర సందర్భంగా గ్రామంలో తీవ్ర మంచినీటి కొరత నెలకొనడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ సమస్యను స్థానిక నాయకులు మాజీ సర్పంచ్ రంగారెడ్డి. మాల ముని , నుకుల వెంకటేష్  తదితరులు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూల్ పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బుట్టా రేణుక గారికి తెలియజేశారు.సమస్యపై వెంటనే స్పందించిన శ్రీమతి బుట్టా రేణుక గారు, తమ భర్త మరియు బుట్టా ఫౌండేషన్ అధినేత శ్రీ బుట్టా శివ నీలకంఠ గారికి సమాచారం అందించారు.

దీనిపై స్పందించిన శ్రీ బుట్టా శివ నీలకంఠ గారు బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తక్షణమే మంచినీటి ట్యాంకర్లను అగ్రహారం గ్రామానికి పంపించి, గ్రామ ప్రజలకు తాత్కాలికంగా తాగునీటి సౌకర్యం కల్పించారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తమ సమస్యను పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకున్నందుకు శ్రీమతి బుట్టా రేణుక గారికి మరియు బుట్టా ఫౌండేషన్‌ అధినేత శ్రీ బుట్టా శివ నీలకంఠ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: పనిచేసే వారికి పట్టం.. మారకుంటే నమస్కారం.. కుప్పం నుంచి చంద్రబాబు స్ట్రాంగ్ మెసేజ్!
Chandrababu Naidu: పనిచేసే వారికి పట్టం.. మారకుంటే నమస్కారం.. కుప్పం నుంచి చంద్రబాబు స్ట్రాంగ్...
By Pagadala Venkateswar 2026-02-01 10:55:04 0 97
Andhra Pradesh
బీ కొత్తకోట : బైక్ పై యువకులు ప్రమాదకర ఫీట్లు
మంగళవారం రాత్రి బి.కొత్తకోటలో నలుగురు మైనర్ యువకులు ఒకే బైక్‌పై వేగంగా వెళ్తూ ప్రమాదకర...
By Pagadala Venkateswar 2026-03-11 04:20:34 0 99
Telangana
ఆబిడ్స్ ఇస్కాన్ ఆలయంలో జూన్ 27న శ్రీ జగన్నాథ రథయాత్ర
 అబిడ్స్‌ ఇస్కాన్‌ ఆలయ ఆధ్వర్యంలో జూన్ 27న శ్రీ జగన్నాథ రథయాత్రను ఘనంగా...
By Sidhu Maroju 2025-06-26 10:25:55 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com