Kanthamma: చిత్తూరు జిల్లాలో మహిళను బోల్తా కొట్టించిన మోసగాళ్లు

0
129

Kanthamma: చిత్తూరు జిల్లాలో మహిళను బోల్తా కొట్టించిన మోసగాళ్లు

07-04-2026 Tue 08:05 | Andhra

Kanthamma loses gold chain in Chittoor district fraud

షార్ట్స్‌లో చూడండి

చిత్తూరు జిల్లాలో కేటుగాళ్లు రెచ్చిపోయారు. ‘జాగ్రత్తగా దాచుకోండి’ అని చెప్పి, ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును చాకచక్యంగా కొట్టేశారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పెనుమూరులో సోమవారం ఈ ఘటన వెలుగుచూసింది.

 

వివరాల్లోకి వెళ్తే.. కాంతమ్మ అనే స్థానిక మహిళ బ్యాంకు పని మీద బయటకు వచ్చారు. ఆమె బ్యాంకు వద్దకు చేరుకోగానే, గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఆమెను మాటల్లోకి దించారు. మెడలో బంగారు గొలుసు వేసుకోవడం సురక్షితం కాదని, దాన్ని తీసి భద్రంగా దాచుకోవాలని నమ్మబలికారు. తామే సహాయం చేస్తామంటూ ముందుకు వచ్చి, ఆమె గొలుసును ఒక కాగితంలో చుట్టి ఇచ్చారు.

 

వారి మాటలు నమ్మిన కాంతమ్మ ఆ పొట్లాన్ని తీసుకుని బ్యాంకు లోపలికి వెళ్లింది. అక్కడ పొట్లం విప్పి చూడగా, అందులో బంగారు గొలుసుకు బదులుగా రాళ్లు ఉండటంతో నిర్ఘాంతపోయింది. తాను మోసపోయానని గ్రహించి గట్టిగా విలపించింది.

 

బాధితురాలు వెంటనే పెనుమూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ తరహా మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
విద్యార్థులకు శక్తి టీం అవగాహన సదస్సు
చీరాల పట్టణంలో దర్బార్ రోడ్డు లోని ఐస్ మ్యాజిక్ వద్ద విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించిన...
By Vadlamudi NagaVenkat 2026-04-02 09:44:24 0 446
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:33:43 0 48
Haryana
Haryana CM Orders Action on Sanitation Negligence and Land Encroachment
Haryana Chief Minister Nayab Singh Saini took strong action against poor civic management in...
By Bharat Aawaz 2025-07-17 06:14:07 0 1K
Andhra Pradesh
ఏసీబీ వలలో పడిన సచివాలయం విలేజ్ సర్వేయర్
*మచిలీపట్నం :*   ఎసీబీ వలలో పడ్డ సచివాలయం  విలేజ్ సర్వేయర్   14వేలు లంచం...
By Rajini Kumari 2026-02-01 11:56:15 0 197
Telangana
ఉద్యమ కేసీఆర్ తో సమస్య లేదు, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అంశంలో మా అమ్మ కుటుంబం నుంచి సరైన సపోర్ట్ రాలేదు...కల్వకుంట్ల కవిత
*వే టు న్యూస్ కాంక్లేవ్ లో పాల్గొన్న తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ శ్రీమతి కల్వకుంట్ల కవిత...
By Ponnala Srinivasrao 2026-05-16 05:02:26 1 144
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com