మదనపల్లె: ఇంట్లో పాతిపెట్టిన బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం.

0
134

మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లిలో శుక్రవారం ఒక అనుమానాస్పద ఘటన వెలుగుచూసింది. ఇంట్లో పాతిపెట్టిన బాలుడి మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. ఉద్యోగరీత్యా కదిరిలో నివసిస్తున్న విజయబాబు–నందిని దంపతుల కుమారుడు వర్షిత్, గత నెల 12న మెట్లపై నుంచి పడి మృతి చెందాడని తల్లి చెప్పడంతో, మృతదేహాన్ని గ్రామంలోని ఇంట్లో పాతిపెట్టారు. అయితే, భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాసిల్దార్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మీభూమి మీ హక్కు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
*ఆత్మకూరు, జనవరి 5:*   *అధికారం చేపట్టిన వెంటనే రైతుల హక్కులు హరించే ల్యాండ్ టైటిలింగ్...
By Rajini Kumari 2026-01-05 11:49:53 0 183
Andhra Pradesh
Ugadi: 'పరాభవ' నామ సంవత్సరం అంటే అవమానం కాదు... అసలు పరమార్థం ఇదే!
తెలుగు వారికి అత్యంత ముఖ్యమైన పండుగ ఉగాది. కాలానికి ఆదిగా భావించే ఈ పర్వదినంతో కొత్త తెలుగు...
By Pagadala Venkateswar 2026-03-20 03:50:09 0 125
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ :పుంగనూరు నియోజకవర్గం: మండలంలో అగ్నిప్రమాదం
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, కోటూరు గ్రామంలో మంగళవారం దొరస్వామి అనే రైతుకు చెందిన...
By Kothuru Murali 2026-02-18 07:27:04 0 158
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com