TTD: తిరుమల శ్రీవారి హుండీలో రద్దయిన పెద్ద నోట్లు!.

0
138

తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల్లో రద్దయిన పాత నోట్ల సమస్య తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి తలనొప్పిగా మారింది. శ్రీవారి హుండీలో పేరుకుపోయిన రూ.500, రూ.1000 పాత నోట్ల విలువ దాదాపు రూ.400 కోట్లకు చేరినట్లు తాజా అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నిధులు నిరుపయోగంగా మారడంతో టీటీడీకి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

 

కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసినప్పటికీ, భక్తులు తమ మొక్కుల్లో భాగంగా ఇప్పటికీ ఈ పాత నోట్లను హుండీలో వేస్తూనే ఉన్నారు. భక్తిభావంతో సమర్పించిన ఈ కానుకలను తిరస్కరించలేని పరిస్థితిలో టీటీడీ ఉంది. హుండీ లెక్కింపు (పరకామణి) సమయంలో సిబ్బంది ఈ పాత నోట్లను వేరు చేసి నిల్వ చేస్తున్నారు. ఏళ్లు గడిచేకొద్దీ ఈ మొత్తం భారీగా పేరుకుపోతోంది.

 

ఈ రద్దు నోట్లను మార్చుకునేందుకు ఒక అవకాశం కల్పించాలని టీటీడీ యాజమాన్యం చాలాకాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)ను కోరుతూ వస్తోంది. పలుమార్లు కేంద్ర ఆర్థిక మంత్రితో, ఆర్బీఐ అధికారులతో చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. టీటీడీకి ప్రత్యేకంగా అనుమతి ఇస్తే, ఇతర సంస్థల నుంచి కూడా ఇలాంటి డిమాండ్లు వస్తాయనే కారణంతో కేంద్రం ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవడం లేదని సమాచారం. దీంతో భక్తులు సమర్పించిన రూ.400 కోట్ల నిధులను ఆలయ అభివృద్ధి, ధార్మిక కార్యక్రమాలకు వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది.

 

మరోవైపు రద్దు చేసిన రూ.2 వేల నోట్లను కూడా భక్తులు హుండీలో సమర్పిస్తున్నారు. దీనిపై పరకామణి ఇన్ చార్జి డిప్యూటి ఈవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి నెలా రూ.35 లక్షల వరకు రూ.2 వేల నోట్లు హుండీలో భక్తులు సమర్పిస్తున్నారని, ఈ నోట్లను ప్రతి రెండు నెలలకు ఒకసారి చెన్నై లోని ఆర్బీఐ రీజినల్ కేంద్రంలో మార్పిడి చేసుకుంటున్నట్లు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
AP Land Prices: ఏపీలో ఆ భూములకు మార్కెట్ ధరలు పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు.
AP Land Prices Andhra Pradesh Hikes Land Values in Urban Areas ఏపీలో పట్టణ ప్రాంత భూముల విలువలు...
By Pagadala Venkateswar 2026-01-25 06:22:43 0 166
Andhra Pradesh
ఆదివారం రోజు కూడా కరెంట్ బిల్లులు చెల్లించవచ్చు ::
కర్నూలు : ఈనెల 28వ తేదీ ఆదివారం సెలవు దినం అయినప్పటికీ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని కర్నూల్...
By Hari Krishna 2025-12-28 01:17:27 0 207
Andhra Pradesh
పుంగనూరులో జాతీయ లోక్ అదాలత్
పుంగనూరు పట్టణంలో శనివారం లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది. సీనియర్ సివిల్ జడ్జి అరీఫా షేక్,...
By Kothuru Murali 2026-06-20 16:25:09 0 79
Andhra Pradesh
పుంగనూరు నియోజ క వర్గం : రథసప్తమి వేడుకలకు సర్వం సిద్ధం.
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరు దేవళంపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద...
By Kothuru Murali 2026-01-25 11:48:08 0 180
Andhra Pradesh
నందిగామలో "జలధార జలహారతి "కార్యక్రమం
నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన పెంపొందించడం ముఖ్య లక్ష్యం: మున్సిపల్ కమిషనర్ లోవరాజు నందిగామ,...
By Patan Khuddus 2026-04-18 10:41:46 0 496
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com