TTD: తిరుమల శ్రీవారి హుండీలో రద్దయిన పెద్ద నోట్లు!.

0
31

తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల్లో రద్దయిన పాత నోట్ల సమస్య తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి తలనొప్పిగా మారింది. శ్రీవారి హుండీలో పేరుకుపోయిన రూ.500, రూ.1000 పాత నోట్ల విలువ దాదాపు రూ.400 కోట్లకు చేరినట్లు తాజా అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నిధులు నిరుపయోగంగా మారడంతో టీటీడీకి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

 

కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసినప్పటికీ, భక్తులు తమ మొక్కుల్లో భాగంగా ఇప్పటికీ ఈ పాత నోట్లను హుండీలో వేస్తూనే ఉన్నారు. భక్తిభావంతో సమర్పించిన ఈ కానుకలను తిరస్కరించలేని పరిస్థితిలో టీటీడీ ఉంది. హుండీ లెక్కింపు (పరకామణి) సమయంలో సిబ్బంది ఈ పాత నోట్లను వేరు చేసి నిల్వ చేస్తున్నారు. ఏళ్లు గడిచేకొద్దీ ఈ మొత్తం భారీగా పేరుకుపోతోంది.

 

ఈ రద్దు నోట్లను మార్చుకునేందుకు ఒక అవకాశం కల్పించాలని టీటీడీ యాజమాన్యం చాలాకాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)ను కోరుతూ వస్తోంది. పలుమార్లు కేంద్ర ఆర్థిక మంత్రితో, ఆర్బీఐ అధికారులతో చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. టీటీడీకి ప్రత్యేకంగా అనుమతి ఇస్తే, ఇతర సంస్థల నుంచి కూడా ఇలాంటి డిమాండ్లు వస్తాయనే కారణంతో కేంద్రం ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవడం లేదని సమాచారం. దీంతో భక్తులు సమర్పించిన రూ.400 కోట్ల నిధులను ఆలయ అభివృద్ధి, ధార్మిక కార్యక్రమాలకు వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది.

 

మరోవైపు రద్దు చేసిన రూ.2 వేల నోట్లను కూడా భక్తులు హుండీలో సమర్పిస్తున్నారు. దీనిపై పరకామణి ఇన్ చార్జి డిప్యూటి ఈవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి నెలా రూ.35 లక్షల వరకు రూ.2 వేల నోట్లు హుండీలో భక్తులు సమర్పిస్తున్నారని, ఈ నోట్లను ప్రతి రెండు నెలలకు ఒకసారి చెన్నై లోని ఆర్బీఐ రీజినల్ కేంద్రంలో మార్పిడి చేసుకుంటున్నట్లు తెలిపారు.

Search
Categories
Read More
Assam
PM Modi Visits Assam, Celebrates Bhupen Hazarika Centenary & Launches Projects
PM #NarendraModi visited #Assam on September 13 for a two-day trip.He attended Dr. Bhupen...
By Pooja Patil 2025-09-13 11:16:37 0 161
Andhra Pradesh
కేంద్రీయ విద్యాలయం, మదనపల్లిలో అడ్మిషన్లు ప్రారంభం.
మదనపల్లెలోని కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి....
By Pagadala Venkateswar 2026-03-21 06:05:04 0 107
Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై సెక్యూరిటీ సిబ్బంది పనితీరుపై మార్పులు రావాలి
పత్రికా ప్రకటన    ఇంద్రకీలాద్రి, 06 జనవరి 2026   సెక్యూరిటీ సిబ్బంది పనితీరులో...
By Rajini Kumari 2026-01-06 11:01:57 0 150
Andhra Pradesh
మదనపల్లి: రైతులు ఉద్యానవన పంటల వైపు మొగ్గు చూపాలి: కలెక్టర్.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ,...
By Pagadala Venkateswar 2026-02-04 07:18:31 0 97
Andhra Pradesh
రాష్ట్రంలో కొత్తగా 13 డయాలసిస్ కేంద్రాలు: మంత్రి సత్యకుమార్.
AP: రాష్ట్రంలో కొత్తగా 13 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు...
By Pagadala Venkateswar 2026-01-24 14:51:59 0 110
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com