శామీర్‌పేట ప్రెస్ మీట్‌లో ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు.|

0
242

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శామీర్‌పేటలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు.

బీఆర్‌ఎస్ నుంచి వెళ్లి ఐదేళ్లు అయినప్పటికీ పార్టీ మార్పుపై వస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ, “పార్టీలు మారడం బట్టలు మార్చినంత ఈజీ కాదు” అన్నారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనను టిఆర్ఎస్ పార్టీ నుంచి పంపించడం తప్పు అని ప్రజల్లో చర్చ జరుగుతోందని, తాను ఎప్పుడూ పదవుల కోసం రాజకీయాలు చేయలేదని స్పష్టం చేశారు. గతంలో తనపై అన్యాయాలు జరిగాయని, భూములు, ఆస్తులపై ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆరోపించారు.

ప్రస్తుత ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పై కూడా తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన, అబద్ధాలపై పాలన కొనసాగుతోందని అన్నారు. GHMC ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ, పార్టీ బలోపేతానికి ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
పోలవరం జిల్లాలో: చేపల వేటకు వెళ్లి నలుగురు ప్రమాద వశత్తు గోదావరిలో గల్లంతు!
పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం సమీపం లోని గోదావరి నదిలో శనివారం జరిగిన విషాద ఘటనలో ఐదుగురు...
By Shyamala Yadagiri 2026-07-18 11:16:06 0 41
Telangana
జూన్ 2 నుంచి రైళ్లలో పురుషులకు ఉచిత ప్రయాణ
హైదరాబాద్ మహానగరం లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం...
By Pinnehasan Odela 2026-04-19 06:51:02 0 295
Telangana
మంచిర్యాల: రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి మృతి
లక్షింపేట మండలం గుల్లకోట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంపీ ఓడి వో కార్యాలయంల ఈసీ శైలజ ...
By Bonagiri RaviShankar 2026-05-30 08:46:11 0 191
Telangana
మంచిర్యాల్: మొదటి రోజు95.8% పూర్తి
మంచిర్యాల జిల్లాలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా 95.8,% మొదటి రోజే పోలియో...
By Bonagiri RaviShankar 2026-06-29 09:34:53 0 107
Andhra Pradesh
పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
పుంగనూరు మండలం భీమగానిపల్లి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ గుణశేఖర్, ఆయన...
By Kothuru Murali 2026-05-21 18:18:32 0 77
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com