టీటీడీ చైర్మన్ వ్యవహార శైలిపై నిరసన

0
208

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారశైలిపై మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి పిలుపు మేరకు శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు. మంగళగిరి పట్టణం ఘాట్ రోడ్డు లోని శ్రీవెంకటేశ్వర ఆలయంలో వెంకటేశ్వర స్వామికి బీఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలు, ఆయన వ్యవహార శైలితో టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్నాడని ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని వైఎస్సార్సీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళగిరి శాసనమండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ.. హైందవ ధర్మం పట్ల, తిరుమల సంప్రదాయాల పట్ల అవగాహన లేని వ్యక్తులను టీటీడీ చైర్మన్ వంటి అత్యున్నత పదవిలో కొనసాగించడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. *బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవి నుంచి వెంటనే తొలగించి టీటీడీ పవిత్రతను కాపాడాలని వైఎస్సార్సీపీ నాయకుల డిమాండ్ చేశారు*. ఈ నిరసన కార్యక్రమంలో మంగళగిరి టౌన్ అధ్యక్షులు ఆకురాతి రాజేష్, తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వేణుగోపాల సోమి రెడ్డి, తాడేపల్లి మండల అధ్యక్షులు అమరా నాగయ్య, దుగ్గిరాల మండల అధ్యక్షులు తాడిబోయిన శివ గోపయ్య, మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా మరియు నియోజకవర్గ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ విభాగ అధ్యక్షులు మహిళ నాయకురాలు, శ్రేణులు పాల్గొన్నాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
రెండేళ్ల సంక్షేమం అభివృద్ధి విజయోత్సవ సభ విజయానికి ఏర్పాట్లు పరిశీలిస్తున్న సుగవాసి ప్రసాద్ బాబు గారు
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించిన రెండేళ్ల సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల...
By Benguluri Madhubabu 2026-06-17 11:29:40 0 95
Telangana
పెద్దపల్లి : మత్తు వ్యతిరేక పోరాటానికి ప్రజల భాగస్వామ్యం అవసరం...!
పెద్దపల్లి పట్టణం చింతపల్లి దర్గా ప్రాంగణంలో ఈగల్ ఫోర్స్, అటవీ  శాఖ పోలీసులు ఆధ్వర్యంలో...
By Sunka Santhosh 2026-06-10 18:04:24 0 86
Telangana
జర్నలిస్ట్ ల అక్రమ నిర్బంధం పై సిపికి జర్నలిస్టుల ఫిర్యాదు.
   హైదరాబాద్ /సికింద్రాబాద్.   శాంతిభద్రతల పరిరక్షణలో జర్నలిస్టుల సహాకారం...
By Sidhu Maroju 2025-08-05 17:27:05 0 762
Andhra Pradesh
గుంటూరులో న్యాయ- పోలీసు సమన్వయ నేర సమీక్ష సమావేశం జరిగినది.
    >కేవీస్సార్. కోటేశ్వరరావు. గుంటూరు.   గుంటూరులో న్యాయ–పోలీసు...
By KOTESWARARAO KVSR 2026-01-10 13:25:27 0 633
Andhra Pradesh
పుంగనూరు: మధ్యాహ్న భోజనంలో పడ్డ బల్లి
అన్నమయ్య జిల్లా, పుంగనూరులోని మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో బుధవారం మధ్యాహ్న భోజనంలో బల్లి...
By Kothuru Murali 2026-04-02 06:10:55 0 147
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com