కర్ణాటకలో మంత్రి నారా లోకేష్ పర్యటన

0
138

*కర్ణాటకలో మంత్రి నారా లోకేష్ పర్యటన*

 

*సింధనూరులో స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి*

 

*సింధనూరు:* 

కర్ణాటకలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శనివారం పర్యటించారు. రాయచూర్ జిల్లా సింధనూరు గంగావతి రోడ్డు హోసళ్లీ క్యాంపులోని తెలుగు సంఘం కళ్యాణమండపంలో నూతనంగా ఏర్పాటుచేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహాన్ని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్.డీ కుమారస్వామి, కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రి సంజయ్ సేథ్ తో కలిసి మంత్రి లోకేష్ ఆవిష్కరించారు. ముందుగా కళ్యాణ మండపం ప్రాంగణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు నిర్వాహకులు, స్థానిక తెలుగుసంఘం నాయకులు, తెలుగు యువత ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు పట్ల నిర్వాహకులను అభినందించారు. చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన సమయంలో సింధనూరు, రాయచూర్ లో నివసిస్తున్న తెలుగు ప్రజలు అండగా నిలిచారు. మీ రుణం తీర్చుకునేందుకే ఇక్కడకు వచ్చాను. తెలుగువారు ఎక్కడున్నా టీడీపీ అండగా ఉంటుంది. కుమారస్వామి గారి పక్కన నిల్చునే అదృష్టం నాకు కలిగింది. తెలుగువారి మద్దతకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మంత్రి నారా లోకేష్ ను శాలువా, ప్రత్యేక జ్ఞాపితకో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ భరత్ తదితరులు పాల్గొన్నారు.

*****

Like
1
Search
Categories
Read More
Fashion & Beauty
Parul Gulati on Fashion, Beauty, and Her Dream Cannes Debut: ‘It’s Not About Standing Out, It’s About Being Me’
Parul Gulati on Fashion, Beauty, and Her Dream Cannes Debut: ‘It’s Not About Standing...
By BMA ADMIN 2025-05-21 13:58:13 0 2K
Andhra Pradesh
ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు
కర్నూలు : తెలుగుదేశం పార్టీలో లోక్ సభ నియోజకవర్గ (జిల్లా) అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను...
By Hari Krishna 2025-12-21 09:30:04 0 171
Telangana
శ్రీ దర్పన్ స్కూల్ దశాబ్ది వేడుకలు: ముఖ్య అతిథిగా శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ డివిజన్ వేణుగోపాల్ నగర్‌లోని శ్రీ దర్పన్ స్కూల్ 10వ...
By Sidhu Maroju 2026-03-14 18:24:45 0 96
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com