కర్ణాటకలో మంత్రి నారా లోకేష్ పర్యటన

0
206

*కర్ణాటకలో మంత్రి నారా లోకేష్ పర్యటన*

 

*సింధనూరులో స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి*

 

*సింధనూరు:* 

కర్ణాటకలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శనివారం పర్యటించారు. రాయచూర్ జిల్లా సింధనూరు గంగావతి రోడ్డు హోసళ్లీ క్యాంపులోని తెలుగు సంఘం కళ్యాణమండపంలో నూతనంగా ఏర్పాటుచేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహాన్ని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్.డీ కుమారస్వామి, కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రి సంజయ్ సేథ్ తో కలిసి మంత్రి లోకేష్ ఆవిష్కరించారు. ముందుగా కళ్యాణ మండపం ప్రాంగణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు నిర్వాహకులు, స్థానిక తెలుగుసంఘం నాయకులు, తెలుగు యువత ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు పట్ల నిర్వాహకులను అభినందించారు. చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన సమయంలో సింధనూరు, రాయచూర్ లో నివసిస్తున్న తెలుగు ప్రజలు అండగా నిలిచారు. మీ రుణం తీర్చుకునేందుకే ఇక్కడకు వచ్చాను. తెలుగువారు ఎక్కడున్నా టీడీపీ అండగా ఉంటుంది. కుమారస్వామి గారి పక్కన నిల్చునే అదృష్టం నాకు కలిగింది. తెలుగువారి మద్దతకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మంత్రి నారా లోకేష్ ను శాలువా, ప్రత్యేక జ్ఞాపితకో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ భరత్ తదితరులు పాల్గొన్నారు.

*****

Like
1
Search
Categories
Read More
Business EDGE
Affiliations with BMA: Powering a Nation Through Media Partnerships 🤝
🤝 Affiliations with BMA: Powering a Nation Through Media Partnerships In a country as diverse...
By Business EDGE 2025-04-30 10:38:27 0 3K
Andhra Pradesh
ఉజ్వల 2.0 కింద 66 మంది మహిళలకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సౌమ్య
నందిగామ మండలం అంబారుపేట గ్రామం లో సోమవారం నాడు ఉజ్వల 2.0 పథకం కింద 66 మంది మహిళా లబ్ధిదారులకు...
By Patan Khuddus 2026-05-11 09:37:27 0 289
Andhra Pradesh
పుంగనూరు :పుంగనూరుకు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు
ఈరోజు అనగా గురువారం05.02.26.ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర రక్షణ కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం'...
By Kothuru Murali 2026-02-05 08:26:50 0 128
Telangana
గాంధీ ఆసుపత్రిలో యువతికి అరుదైన ఆపరేషన్ .|
       హైదరాబాద్ : (భారత్ ఆవాస్ ప్రతినిధి)  ఆసిఫాబాద్ కు చెందిన...
By Sidhu Maroju 2026-01-21 09:53:45 0 156
Andhra Pradesh
79 మంది మీడియా ప్రతినిధులకు అక్రిడేషన్లు మంజూరు
బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్, డిఎంఎసి చైర్మన్ సుమిత్ కుమార్ ఐఏఎస్ అధ్యక్షతన...
By Kothuru Murali 2026-04-16 17:15:32 0 76
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com