చేనేతల ద్రోహి మాజీ ఎంపీ బుట్టా రేణుక

0
162

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి చేనేత సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని కుట్ర రాజకీయాలు చేసేందుకు మాజీ ఎంపీ బుట్టారేణుక డ్రామాలు చేస్తున్నారని నందవరం మండల కన్వీనర్ కాసీంవలి అన్నారు. గురువారం నందవరం మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ… ఎమ్మిగనూరు చేనేతల కో ఆపరేటీవ్ సొసైటీ ( ywcs)ని ఆప్కోలో వీలీనం చేస్తున్నారనే ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. మార్కెటింగ్ మర్జర్ చేయడాన్ని వైసీపీ తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు. ఎమ్మిగనూరు చేనేత సొసైటీలో వేల మంది సభ్యులు ఉన్న స్థితి నుండి 200 మందికి తగ్గినప్పుడు ఇదే బుట్టారేణుక ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. చేనేత సొసైటీ బాగుకోసం మా నాయకుడు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి గారు క్రుషి చేస్తున్నారని అన్నారు. కేవలం 200 మంది కోసం కాకుండా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉన్న 40 వేల మంది చేనేతల భవిష్యత్తును గురించి ఎమ్మెల్యే బివి గారు ఆలోచిస్తున్నారన్నారు. స్వర్గీయ బివి మోహన్ రెడ్డి గారి హయాం నుండి ఇప్పుడు ఆయన వారసుడు బివి జయనాగేశ్వర రెడ్డి గారి వరకు ఎమ్మిగనూరు మున్సిపల్ చైర్మన్ గా చేనేతలకు అవకాశం ఇచ్చారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఈ సంప్రదాయాన్ని ప్రారంభించిందే బివి కుటుంబం అన్నారు. చేనేతలను మోసం చేసిన చరిత్ర వైసీపీదేనని ఎద్దేవా చేశారు. కుర్ణి కులస్తులు ఉన్న నాగలదిన్నె గ్రామాన్ని దత్తత తీసుకుని కనీసం పిడికెడు మన్ను కూడా వేయకుండా దత్తత నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని పారిపోయిన చరిత్ర మీది. కూటమి ప్రభుత్వం సంప్రదాయ మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోందని అన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద 92,724 మంది నేతన్నలకు రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెన్షన్ మొత్తం పెంచారని తెలిపారు. చేనేతలకు త్రిఫ్ట్ కింద ప్రభుత్వ వాటాను 8 నుంచి 16 శాతానికి పెంచారని చెప్పారు. ఈ పథకం కింద ప్రతి బడ్జెట్ లోనూ రూ. 5 కోట్ల చొప్పున కేటాయిస్తూ వస్తున్నారని తెలిపారు. ఎన్ని కుట్రలు చేసినా చేనేతల పట్ల బివి కుటుంబానికి ఉన్న అపారమైన అనుబంధాన్ని విడదీయలేరని అన్నారు. తప్పుడు ఆరోపణలతో చేనేతల ద్రోహిగా బుట్టారేణుక చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకుని బుట్టా రేణుక ఎమ్మిగనూరు నియోజకవర్గ చేనేతలకు, ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి గారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు..!

Search
Categories
Read More
Andhra Pradesh
BR Naidu: హిందువుల ప్రాణాలు తీసేందుకే లడ్డూల్లో విష రసాయనాలు.. వైసీపీ మహాపాపం చేసింది: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.
BR Naidu: హిందువుల ప్రాణాలు తీసేందుకే లడ్డూల్లో విష రసాయనాలు.. వైసీపీ మహాపాపం చేసింది: టీటీడీ...
By Pagadala Venkateswar 2026-01-31 06:19:42 0 125
Andhra Pradesh
మున్సిపల్ ఉద్యోగులతో ఓటర్ల ప్రతిజ్ఞ చేయించిన కమిషనర్
కర్నూలు :  ప్రతి ఓటు విలువైనదే..• కర్నూలు నియోజకవర్గ ఆర్వో, కమిషనర్...
By Hari Krishna 2026-01-23 14:04:22 0 153
Telangana
గోరక్షకుడు ప్రశాంత్ సింగ్ పై దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలి |
సికింద్రాబాద్ : మేడిపల్లి యంనం పేట్ వద్ద కాల్పులలో గాయపడి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న...
By Sidhu Maroju 2025-10-23 15:27:56 0 254
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణం లో వెలసిన సుగుటూరు గంగమ్మ జాతరకు రెండో చాటింపు ఇదే
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో ఈ నెల 10, 11 తేదీలలో సుగుటూరు గంగమ్మ జాతర జరగనుంది. ఈ...
By Kothuru Murali 2026-03-07 06:54:48 0 116
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com