Pawan Kalyan: అమరావతి బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. ఇది చారిత్రాత్మక ఘట్టమన్న పవన్ కల్యాణ్.

0
228

ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని నిర్ధారిస్తూ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందడంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే ఒక చారిత్రాత్మక, కీలకమైన ఘట్టమని అభివర్ణించారు. ఈ చరిత్రాత్మక సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు కోట్ల మంది ప్రజలకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రజల సంకల్పానికి, ఆకాంక్షలకు ఈ బిల్లు ప్రతిబింబమని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.

 

ఈ సందర్భంగా అమరావతి రైతుల మహోన్నత త్యాగాన్ని పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా స్మరించుకున్నారు. "తరతరాలు గుర్తుంచుకునేలా, అపారమైన విశ్వాసంతో 33,000 ఎకరాలకు పైగా భూములను రాజధాని కోసం త్యాగం చేసిన రైతులకు నా ప్రగాఢ గౌరవాన్ని, కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను" అని పేర్కొన్నారు. అదే సమయంలో, అమరావతికి బలమైన పునాది వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనిక నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా కొనియాడారు. ఈ బృహత్ కార్యం వాస్తవరూపం దాల్చడానికి నిరంతరం మద్దతుగా నిలుస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ఎన్డీయే ప్రభుత్వానికి పవన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

 

గత ప్రభుత్వ తిరోగమన, ఏకపక్ష నిర్ణయాల వల్ల రాష్ట్రం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొందని పవన్ విమర్శించారు. రైతుల పోరాటాలు, మహిళల ఆవేదన, యువత భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రజలు అసాధారణమైన ధైర్యాన్ని, స్పష్టతను ప్రదర్శించారని కొనియాడారు. స్థిరమైన ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా ప్రజలు అభివృద్ధికి, సుస్థిరతకు పట్టం కట్టారని అన్నారు.

 

పార్లమెంటు ఆమోదంతో రాష్ట్ర ప్రజల్లోనే కాకుండా, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల్లోనూ బలమైన, పునరుత్తేజంతో కూడిన విశ్వాసం ఏర్పడిందని పవన్ అభిప్రాయపడ్డారు. అమరావతి కేవలం రాజధానిగానే కాకుండా, రాష్ట్ర ప్రజల ఆశ, సంకల్పం, సమష్టి కృషికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్, ప్రధాని మోదీ ఆవిష్కరించిన వికసిత భారత్ లక్ష్యాల సాధనలో అమరావతి కీలక పాత్ర పోషిస్తుందని ఆయన దృఢ విశ్వాసం వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Telangana
భూకబ్జాదారులకు బిగ్ షాక్.. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా విస్తరణ!
హైడ్రా కమీషనర్ ఏ.వి రంగనాథ్ తెలంగాణ రాష్ట్రంలో భూ ఆక్రమణలకు పాల్పడేవారికి, ముఖ్యంగా చెరువులు...
By Ponnala Srinivasrao 2026-05-08 00:46:48 0 137
Telangana
నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసిన నిందితుడు రియాజ్ పోలీసులకు దొరికిండు.
హైదరాబాద్:  నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసి పరారైన రియాజ్ పోలీసులకు...
By Sidhu Maroju 2025-10-19 12:55:17 0 292
Telangana
అక్క గారు కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు దేవరపల్లి కవిత అక్క గారు కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు చెసారు...
By Ponnala Srinivasrao 2026-03-26 05:27:06 0 203
Telangana
అక్రమ ఇసుక రవాణాపై కలెక్టర్ కే.హరిత ఉక్కుపాదం:కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్
ఆసిఫాబాద్ జిల్లాలో సాగుతున్న అక్రమ ఇసుక రవాణాను అరికట్టెందుకు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా...
By Chunarkar Jagadeesh 2026-05-06 16:28:21 1 971
Andhra Pradesh
Kolusu Parthasarathy: 11 సీట్లకే పరిమితమైనా మీ 'తాచుపాము' బుద్ధి మారలేదు: మంత్రి పార్థసారథి.
ప్రజా రాజధాని అమరావతిపై వైసీపీ విషం చిమ్ముతోందని మంత్రి పార్థసారథి విమర్శ నాడు అసెంబ్లీలో జై...
By Pagadala Venkateswar 2026-01-17 11:19:01 0 190
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com