భూకబ్జాదారులకు బిగ్ షాక్.. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా విస్తరణ!

0
137

హైడ్రా కమీషనర్ ఏ.వి రంగనాథ్ తెలంగాణ రాష్ట్రంలో భూ ఆక్రమణలకు పాల్పడేవారికి, ముఖ్యంగా చెరువులు కబ్జాలు చేస్తున్న వారికి బిగ్ షాక్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం 'హైడ్రా' సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని కీలక నిర్ణయం తీసుకుందని వెల్లడించారు . నల్గొండ జిల్లా మిర్యాలగూడ పర్యటనలో భాగంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గురువారం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.తమ సేవలు రాష్ట్రం మొత్తం అందుబాటులో ఉండాలని ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో వినతులు వస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ విస్తరణ నిర్ణయం తీసుకుందని హైడ్రా కమీషనర్ పేర్కొన్నారు.హైడ్రా తన కార్యకలాపాలతో ఇప్పటివరకు సుమారు రూ.85,000 కోట్ల విలువైన భూములను కబ్జాల నుంచి కాపాడినట్లు ఆయన ప్రకటించారు. మరో సంవత్సరంలోగా రూ.1లక్ష కోట్లు విలువైన భూములను రక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు.

‎హైడ్రా పరిధిలో ఏకంగా రూ.10 లక్షల కోట్ల విలువైన భూములు కబ్జాకు గురయ్యాయనే సమాచారం ఉందని కమిషనర్ వెల్లడించారు. భూ కబ్జాలకు సంబంధించి హైడ్రాకు వేలాది ఫిర్యాదులు వస్తున్నాయని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఈ అంకితభావంతో, పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను పరిష్కరించేందుకు వీలుగా హైడ్రా 'ప్రజావాణి' కార్యక్రమాన్ని నాలుగు వారాల పాటు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ప్రథమ స్థానం అవార్డు సాధించిన పోలీస్ అధికారులు
*ప్రకాశం జిల్లా తేదీ:13.03.2026*   *క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో రాష్ట్రంలో ప్రథమ స్థానం...
By Rajini Kumari 2026-03-13 13:40:59 0 156
Telangana
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ పర్యటన వివరాలు
ఉదయం 10:00 గంటలకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి...
By Avunoori Mahesh 2026-04-13 15:00:40 0 201
Andhra Pradesh
ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శశిభూషణ్ కుమార్ తో మంత్రి మండిపల్లి భేటీ
Press Release  సచివాలయం,అమరావతి  (10-07-2026).    *హింద్రీనివా సుజల...
By Benguluri Madhubabu 2026-07-10 13:56:36 0 94
Telangana
ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి -రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
మహబూబాబాద్,డిసెంబర్ 22 (భారత్ అవాజ్):రాష్ట్రంలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేసి త్వరగా...
By Bheeshman King 2025-12-22 12:55:24 0 306
Andhra Pradesh
వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోట్ల !!
కర్నూలు : డోన్ :  నంద్యాల జిల్లా డోన్ మండలంలోని ఓబుళాపురం గ్రామంలో ఈ రోజు నూతనంగా ఏర్పాటు...
By Hari Krishna 2026-01-09 08:24:19 0 257
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com