జన్ ఔషధి కేంద్రాల బలోపేతానికి కీలక సూచనలు.. ఎంపీ ఈటెల.|

0
147

హైదరాబాద్ :పార్లమెంట్‌లో రూల్ 377 కింద ఫార్మాస్యూటికల్స్ & మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (PMBI)లో సీఈఓ పోస్టు నెలలుగా ఖాళీగా ఉండటం పట్ల ఆందోళన వ్యక్తమైంది. వెంటనే శాశ్వత సీఈఓను నియమించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్  కోరారు.

అలాగే Pradhan Mantri Jan Aushadhi Yojana కేంద్రాల్లో మందుల కొరత లేకుండా ఉండేందుకు PMBIకి స్వంత తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని, లేదంటే ప్రముఖ కంపెనీలతో దీర్ఘకాల సరఫరా ఒప్పందాలు చేయాలని సూచించారు.

జన్ ఔషధి కేంద్రాల నిర్వహకులకు ఇన్సెంటివ్‌లు పెంచడంతో పాటు స్పష్టమైన ట్రాన్స్‌ఫర్/టేకోవర్ పాలసీ తీసుకురావాలని కోరారు. అన్ని కేంద్రాల్లో లైఫ్ సేవింగ్, క్యాన్సర్ మరియు అత్యవసర మందులు తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

దేశంలోని డాక్టర్లు జనరిక్ మందులు రాయడం తప్పనిసరి చేసే చట్టం తీసుకురావాలని, అలాగే కేంద్ర, పీఎస్‌యూ, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిలో జన్ ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎం.పి డిమాండ్ చేశారు.

దేశవ్యాప్తంగా జన్ ఔషధి కేంద్రాలను 50,000 వరకు విస్తరించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు మరియు సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలని అయన సూచించారు.

#sidhumaroju 

Alwal

Search
Categories
Read More
Goa
गोवा विद्यापीठ-INCOIS MoU समुद्र संशोधनात वादस्पद सहकार्य
गोवा विद्यापीठ आनी #INCOIS यांच्यात आपत्ती व्यवस्थापन आनी #समुद्रसंशोधन क्षेत्रात सहकार्य...
By Pooja Patil 2025-09-13 09:26:48 0 179
Andhra Pradesh
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి పార్టీ సమావేశం
విజయవాడ    విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ స్థాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...
By Rajini Kumari 2026-04-08 16:19:28 0 136
Bihar
Adani Power Deal Bihar’s Gain or Monopoly Pain
Adani Power Ltd has inked a 25-year deal with #BSPGCL to supply 2,400 MW electricity to Bihar....
By Pooja Patil 2025-09-15 04:39:51 0 904
Andhra Pradesh
పుంగనూరు: త్వరితగతిన పనులు పూర్తి చేయాలి: కలెక్టర్
చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్లలో నూతనంగా నిర్మిస్తున్న...
By Kothuru Murali 2026-05-13 18:40:27 0 50
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com