సింగరేణిలో “రివ్యూ మీటింగ్‌లు” పేరుతో కాలక్షేపం జరుగుతోందా? అనే ప్రశ్న ఇప్పుడు కార్మికుల్లో తీవ్రంగా వినిపిస్తోంది.

0
95

సింగరేణిలో “రివ్యూ మీటింగ్‌లు” పేరుతో కాలక్షేపం జరుగుతోందా? అనే ప్రశ్న ఇప్పుడు కార్మికుల్లో తీవ్రంగా వినిపిస్తోంది,సమస్యల పరిష్కారం కోసం నిర్వహించాల్సిన సమావేశాలు కేవలం ఫోటోలు, ప్రకటనలు, హామీలకే పరిమితమవుతున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి మీటింగ్ తర్వాత “సానుకూల చర్చ జరిగింది”, “త్వరలో పరిష్కారం” అనే మాటలు వినిపిస్తున్నా, నేలమీద మార్పు మాత్రం కనిపించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి,పెండింగ్ డిమాండ్లు,ఉద్యోగ భద్రత,ఖాళీల భర్తీ,కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు,ఇవన్నీ సంవత్సరాలుగా పెండింగ్‌లోనే ఉండగా, యాజమాన్యం మరియు కొన్ని యూనియన్ నాయకులు మాత్రం రివ్యూ మీటింగ్‌ల పేరుతో కాలాన్ని నెట్టేస్తున్నారనే అభిప్రాయం బలపడుతోంది,సింగరేణి కార్మికుల కష్టం మీద నడిచే సంస్థ. కాబట్టి సమావేశాలు కేవలం ప్రదర్శనగా కాకుండా, సమస్యల పరిష్కారానికి మార్గదర్శకంగా మారాలని కార్మికులు కోరుతున్నారు.“మీటింగ్‌లు కాదు… ఫలితాలు కావాలి” అనే నినాదం ఇప్పుడు సింగరేణి ప్రాంతాల్లో గట్టిగా వినిపిస్తోంది.

Search
Categories
Read More
Telangana
శాంతి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఆల్వాల్‌లో HPV వ్యాక్సిన్ ప్రారంభం.!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆల్వాల్ ప్రాథమిక ఆరోగ్య...
By Sidhu Maroju 2026-03-30 09:53:14 0 106
Andhra Pradesh
ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనులుండాలి
ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉపాధి పనులు చేయాలని ఎంపీడీఓ పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలం చింతాడ...
By Boiena Rajesh 2026-05-09 13:22:37 0 81
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : వీబీజీ-రామ్ పథకంపై ఈనెల 9న అవగాహన
సదుం ఎంపీడీవో రాధారాణి మాట్లాడుతూ, ఈనెల 9న వీబీజీ-రామ్ పథకంపై ప్రత్యేక అవగాహన సమావేశం ఏర్పాటు...
By Kothuru Murali 2026-03-08 08:18:15 0 110
Telangana
బీర్ల ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం
భారత్ ఆవాజ న్యూస్ రాజాపేట  మే 13 ఎన్డిడిబి తో మదర్ డైరీ ఒప్పందం కుదరచడంలో కీలకపాత్ర పోషించి...
By Pindikura Mahesh 2026-05-14 03:46:12 0 80
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com