జన్ ఔషధి కేంద్రాల బలోపేతానికి కీలక సూచనలు.. ఎంపీ ఈటెల.|

0
188

హైదరాబాద్ :పార్లమెంట్‌లో రూల్ 377 కింద ఫార్మాస్యూటికల్స్ & మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (PMBI)లో సీఈఓ పోస్టు నెలలుగా ఖాళీగా ఉండటం పట్ల ఆందోళన వ్యక్తమైంది. వెంటనే శాశ్వత సీఈఓను నియమించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్  కోరారు.

అలాగే Pradhan Mantri Jan Aushadhi Yojana కేంద్రాల్లో మందుల కొరత లేకుండా ఉండేందుకు PMBIకి స్వంత తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని, లేదంటే ప్రముఖ కంపెనీలతో దీర్ఘకాల సరఫరా ఒప్పందాలు చేయాలని సూచించారు.

జన్ ఔషధి కేంద్రాల నిర్వహకులకు ఇన్సెంటివ్‌లు పెంచడంతో పాటు స్పష్టమైన ట్రాన్స్‌ఫర్/టేకోవర్ పాలసీ తీసుకురావాలని కోరారు. అన్ని కేంద్రాల్లో లైఫ్ సేవింగ్, క్యాన్సర్ మరియు అత్యవసర మందులు తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

దేశంలోని డాక్టర్లు జనరిక్ మందులు రాయడం తప్పనిసరి చేసే చట్టం తీసుకురావాలని, అలాగే కేంద్ర, పీఎస్‌యూ, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిలో జన్ ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎం.పి డిమాండ్ చేశారు.

దేశవ్యాప్తంగా జన్ ఔషధి కేంద్రాలను 50,000 వరకు విస్తరించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు మరియు సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలని అయన సూచించారు.

#sidhumaroju 

Alwal

Search
Categories
Read More
Uttarkhand
Uttarakhand Approves ₹213 Crore for Key Projects
The Uttarakhand government has approved massive financial sanctions totaling ₹213 crore to...
By Tejaswini Komanduru 2026-06-05 08:48:31 0 495
Telangana
రాత్రిపూట ఇంటి తాళం పగలగొట్టి బంగారు వెండి నగల చోరీ
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  అల్వాల్  డిటెక్టివ్ ఇన్స్పెక్టర్  తిమ్మప్ప తెలిపిన...
By Sidhu Maroju 2025-09-23 16:01:54 0 445
Uttar Pradesh
Mission "Deep Tech Capital": UP Accelerates Infrastructure & Innovation
Uttar Pradesh is rapidly transitioning into India's "Deep Tech Capital," as highlighted by recent...
By Dunna Jessicaruth 2026-05-14 08:54:14 0 88
Telangana
36 వ మున్సిపల్ డివిజన్లోని ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం లో పాల్గొన్న మాజీ డీసీసీ అధ్యక్షురాలు : కొక్కిరాల సురేఖ
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 36వ డివిజన్ లో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లు...
By Avunoori Mahesh 2026-04-26 12:45:49 0 156
Andhra Pradesh
Rajendra Prasad: సినీ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లకు 'పద్మశ్రీ'... మొత్తం 113 మంది 'పద్మశ్రీ'ల జాబితా ఇదిగో!
  Rajendra Prasad: సినీ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లకు 'పద్మశ్రీ'... మొత్తం 113 మంది...
By Pagadala Venkateswar 2026-01-26 06:55:46 0 170
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com