వైసిపి ఆరోపణలను తిప్పి కొట్టాలి గొల్లపూడిలో దేవినేని ఉమా

0
167

అమరావతి రాష్ట్ర ప్రజల శాశ్వత రాజధాని – దేశం గర్వించే నగరంగా సీఎం చంద్రబాబు తీర్చిదిద్దుతారు

 

వైసీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి 

 

పెన్షన్ పంపిణీలో ప్రభుత్వ చిత్తశుద్ధి స్పష్టంగా కనిపిస్తోంది : మాజీ మంత్రి దేవినేని ఉమా

 

విజయవాడ రూరల్ , గొల్లపూడి : 01 ఏప్రిల్ 2026

 

రాష్ట్ర ప్రజల శాశ్వత రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయడం కూటమి ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని, దాన్ని దేశం గర్వించే నగరంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని టిడిపి నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. గొల్లపూడిలో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ దృష్టి అని పేర్కొన్నారు. అమరావతి రాజధానిపై వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని, ఎక్కడికక్కడ దాన్ని ఖండించాలని పిలుపునిచ్చారు.

 

సాగునీటి ప్రాజెక్టుల విషయానికి వస్తే, గతంలో ప్రజలకు నష్టం కలిగించిన వైసీపీకి ఇప్పుడు వాటిపై మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన విమర్శించారు. ఇక సామాజిక సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని ఉమా స్పష్టం చేశారు. ఎన్నిఆర్ధిక ఇబ్బందులు ఉన్నా ప్రతి నెల ఒకటో తేదీనే పెన్షన్లు అందజేయడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. పెన్షన్ పొందుతున్న వృద్ధులు, దివ్యాంగులు ప్రభుత్వంపై విశ్వాసం ఉంచుతున్నారని, ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
జనవరి 01, 2026 తెలుగు పంచాంగం.
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, తేదీ ... 01 - 01 - 2026, వారం ... బృహస్పతివాసరే ( గురువారం...
By John Baji 2026-01-01 02:31:47 0 207
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష రాత్రి వేళ ద్విచక్ర వాహనంపై ఒంటరిగా వచ్చి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Madanapalle: మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఒంటరిగా జిల్లా...
By Pagadala Venkateswar 2026-07-18 06:55:15 0 30
Telangana
Hyderabad metro funds for irfc
హైద‌రాబాద్ మెట్రోకు IRFC నుంచి రుణం విష‌య‌మై రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వినీ...
By G k Nookala 2026-06-22 19:00:19 0 151
Andhra Pradesh
పిఠాపురంలో పవన్‌కల్యాణ్‌ పర్యటన.. సంక్రాంతి సంబరాలకు ఏర్పాట్లు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఈ నెల 10వ తేదీన పిఠాపురంలో పర్యటించనున్నారు. అక్కడ...
By Pagadala Venkateswar 2026-01-06 07:43:30 0 221
Andhra Pradesh
చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ కి 25 కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు ....
చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ కి 25 కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు చేసిన ఉప ముఖ్యమంత్రి...
By SivaNagendra Annapareddy 2025-12-15 15:01:08 0 278
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com