వైసిపి ఆరోపణలను తిప్పి కొట్టాలి గొల్లపూడిలో దేవినేని ఉమా

0
133

అమరావతి రాష్ట్ర ప్రజల శాశ్వత రాజధాని – దేశం గర్వించే నగరంగా సీఎం చంద్రబాబు తీర్చిదిద్దుతారు

 

వైసీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి 

 

పెన్షన్ పంపిణీలో ప్రభుత్వ చిత్తశుద్ధి స్పష్టంగా కనిపిస్తోంది : మాజీ మంత్రి దేవినేని ఉమా

 

విజయవాడ రూరల్ , గొల్లపూడి : 01 ఏప్రిల్ 2026

 

రాష్ట్ర ప్రజల శాశ్వత రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయడం కూటమి ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని, దాన్ని దేశం గర్వించే నగరంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని టిడిపి నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. గొల్లపూడిలో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ దృష్టి అని పేర్కొన్నారు. అమరావతి రాజధానిపై వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని, ఎక్కడికక్కడ దాన్ని ఖండించాలని పిలుపునిచ్చారు.

 

సాగునీటి ప్రాజెక్టుల విషయానికి వస్తే, గతంలో ప్రజలకు నష్టం కలిగించిన వైసీపీకి ఇప్పుడు వాటిపై మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన విమర్శించారు. ఇక సామాజిక సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని ఉమా స్పష్టం చేశారు. ఎన్నిఆర్ధిక ఇబ్బందులు ఉన్నా ప్రతి నెల ఒకటో తేదీనే పెన్షన్లు అందజేయడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. పెన్షన్ పొందుతున్న వృద్ధులు, దివ్యాంగులు ప్రభుత్వంపై విశ్వాసం ఉంచుతున్నారని, ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏఐఎస్ఎఫ్ ఉద్యమాలకు శ్రీకారం
ఎమ్మిగనూరు పట్టణంలో ప్రవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్న దోపిడి పై సమరశీల పోరాటాలకు సిద్ధం...
By Boya Dasthagiri 2026-05-12 08:51:43 0 115
Andhra Pradesh
చీరాలలోని వాడ్రేవులో  ఆదివారం ఆపరేషన్ వజ్రపహార్ లో....
చీరాల:చీరాలలోని వాడ్రేవులో  ఆదివారం ఆపరేషన్ వజ్రపహార్ లో భాగంగా సమాజంలో మత్తు పదార్థాలను...
By Gadiyapudi Narendra 2026-03-01 16:28:38 0 170
Andhra Pradesh
Prakasam district: బంజరు భూమిలో ఈ ఆనవాళ్లు.. ఆ పక్కనే ఉన్న నీటి కుంట వద్ద!!!!
పచ్చని పంటలు పండే పొలాల పక్కన ఉన్న బంజరు భూమిలో క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించడంతో గ్రామంలో...
By SivaNagendra Annapareddy 2025-12-20 05:05:41 0 199
Andhra Pradesh
ప్రజాసేవలో అంకితభావంతో మంత్రి నారా లోకేష్
*ప్రజాసేవలో అంకితభావంతో మంత్రి నారా లోకేష్*   *విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులతో...
By Rajini Kumari 2026-01-23 11:53:18 0 173
Andhra Pradesh
తోటవారిపాలెం పంట పొలాల్లో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం,ఘటనా స్థలాన్ని సందర్శించిన డి.ఎస్.పి, పోలీసుల విచారణ
చీరాల: ఈరోజు చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోటవారి పాలెం అంబేద్కర్ నగర్ జంక్షన సమీపంలో...
By Gadiyapudi Narendra 2026-02-02 13:18:03 0 181
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com