Madanapalle: మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష రాత్రి వేళ ద్విచక్ర వాహనంపై ఒంటరిగా వచ్చి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

0
27

Madanapalle: మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఒంటరిగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎమర్జెన్సీ వార్డును సందర్శించి చికిత్స పొందుతున్న రోగులకు అందుతున్న వైద్య సేవలపై వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుని మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు.

 

ఈ సందర్భంగా ముదివేడు క్రాస్‌కు చెందిన ఓ మహిళ వేధింపులు తట్టుకోలేక విషం సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై ఎమ్మెల్యే స్పందించారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

 

కుటుంబ సభ్యుల నుంచి ఘటన వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే, మహిళను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రశేఖర్ అనే వ్యక్తిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ముదివేడు పోలీసులను ఆదేశించారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఆమెకు అత్యుత్తమ వైద్య చికిత్స అందించాలని వైద్యులను ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆదేశించారు. ఎమ్మెల్యే ద్విచక్ర వాహనంపై ఒంటరిగా వచ్చి ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేయడం అక్కడున్న రోగులు, వారి కుటుంబ సభ్యుల దృష్టిని ఆకర్షించింది.

Search
Categories
Read More
SURAKSHA
Sudhir Rajpal, IAS: Driving Haryana's Growth with Vision
A distinguished 1990-batch IAS officer of the Haryana cadre, Sudhir Rajpal has played a...
By Lokeshwari Panthadi 2026-07-24 08:04:39 0 6
Telangana
ఇంజెక్షన్‌తోనే పిల్లలు పుడతారట.. నమ్మి వెళ్లిన ఆ దంపతులు.. చివరకు..
హైదరాబాద్‌లో సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న...
By Ponnala Srinivasrao 2026-06-24 01:36:46 0 102
Sikkim
Sikkim Hydropower Projects Driving Green Energy Growth
Sikkim’s hydropower and energy projects continue to play a crucial role in the...
By Fathima Safa 2026-06-25 07:38:55 0 56
Andhra Pradesh
ఇఫ్తార్ విందులో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు సుగువాసి ప్రసాద్ బాబు
రాయచోటి పట్టణం కొత్తపేట ముస్తఫా వీధిలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం...
By Benguluri Madhubabu 2026-03-08 13:24:57 0 196
Andhra Pradesh
పుంగునూరు: ఫిట్స్ రావడంతో వ్యక్తికి తీవ్ర గాయాలు
పుంగనూరు మండలం, ఈడీగపల్లె చెక్ పోస్ట్ వద్ద ఆదివారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ గుర్తు తెలియని...
By Kothuru Murali 2026-04-19 11:21:40 0 98
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com