"ఆల్వాల్ పీఎస్‌లో ఎస్హెచ్ఓ ప్రశాంత్ ఆధ్వర్యంలో శాంతి కమిటీ మీటింగ్.|"

0
181

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : రాబోయే హనుమాన్ జయంతి శోభాయాత్రలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు ఆల్వాల్ పోలీస్ స్టేషన్ లో శాంతి కమిటీ సమావేశాన్ని ఎస్‌హెచ్‌ఓ ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ మతాల ప్రతినిధులు, శోభాయాత్ర నిర్వాహకులు, స్థానిక పెద్దలు హాజరయ్యారు.

సమావేశంలో శోభాయాత్రల రూట్ మ్యాప్, భద్రతా ఏర్పాట్లు, చట్టం-శాంతి పరిరక్షణ, అనుమతించిన సమయాల పాటింపు, శబ్ద నియంత్రణ నిబంధనలు, పోలీసులతో సమన్వయం వంటి కీలక అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌ఓ ప్రశాంత్ మాట్లాడుతూ... హనుమాన్ జయంతి శోభాయాత్రలు ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో జరుపుకునే ముఖ్యమైన వేడుకలని, ఈ వేడుకలు శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా జరగడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. నిర్వాహకులు ముందుగా నిర్ణయించిన మార్గాలనే అనుసరించాలని, అనుమతించిన సమయాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా సౌండ్ సిస్టమ్ వినియోగంపై జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

అలాగే, ర్యాలీల సమయంలో యువత భావోద్వేగాలకు లోనుకాకుండా శాంతంగా వ్యవహరించాలని, ఎలాంటి వివాదాస్పద చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఏదైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని, పోలీసులతో సమన్వయం కొనసాగిస్తే వేడుకలు విజయవంతంగా పూర్తవుతాయని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా పాల్గొన్న ప్రతినిధులు హనుమాన్ జయంతి వేడుకలను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

#sidhumaroju

Alwal.

Search
Categories
Read More
Andhra Pradesh
నందిగామలో అశోక్ అగ్రికల్చర్ వర్క్ షాప్ ప్రారంభం
నందిగామ పట్టణం రామన్నపేట రోడ్డు బైపాస్‌లోని రమణ కాలనీ ఫ్లైఓవర్ క్రింద నూతనంగా ఏర్పాటు చేసిన...
By Patan Khuddus 2026-05-13 16:47:31 0 239
Andhra Pradesh
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు!!
కర్నూలు :  ఐవోసీఎల్‌లో 394 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులుఇండియన్ ఆయిల్ కార్పొరేషన్...
By Hari Krishna 2025-12-24 14:32:32 0 249
Andhra Pradesh
విద్యుత్ చార్జీలపై దోచింది కొండంత.. తిరిగిచ్చేది పిసరంత
వైఎస్ షర్మిలా రెడ్డి గారు ఏపీసీసీ చీఫ్ విద్యుత్ చార్జీలపై దోచింది కొండంత.. తిరిగిచ్చేది పిసరంత....
By Chennaiah Kati 2026-07-16 11:53:20 0 42
Rajasthan
Rajasthan Strengthens Agriculture and Rural Development
Rajasthan is enhancing agriculture and rural development through improved irrigation, sustainable...
By Fathima Safa 2026-06-30 12:17:26 0 56
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:30:14 0 39
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com