లోకేష్ సార్ మా పాఠశాలను కాపాడండి.

0
109

లోకేశ్‌ సర్‌... మా పాఠశాలను కాపాడండి

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు మదనపల్లె మండలం కొత్తవారిపల్లె పంచాయతీ పాలెంకొండకు చెందిన పూర్వ విద్యార్థిని బి.నాగలక్ష్మి వాట్సాప్‌ ద్వారా లేఖ రాసింది. 1991లో సీఎం చంద్రబాబు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మంజూరు చేయబడిందని, ప్రస్తుతం 20 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని ఆమె తెలిపింది. ఇదే పల్లెలో వైసీపీ నేత ఒకరు పాఠశాల ఆవరణలోని 2కుంటల స్థలాన్ని ఆక్రమించేందుకు కుట్రలు పన్నారని, కొండ నీళ్లను పాఠశాల ఆవరణలోకి మళ్లించాడని, బయో ఫెన్సింగ్‌ మొక్కలను ఆవులతో మేపించేశాడని పేర్కొంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, పాఠశాల మూతపడితే స్థలాన్ని ఆక్రమించడం సులువు అవుతుందని భావించి టీచర్లను బెదిరిస్తున్నారని తెలిపింది. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ఇలాంటి వారిపై చర్యలు తీసుకుని పాఠశాల స్థలానికి రక్షణ కల్పించి, పాఠశాల మూతపడకుండా చూడాలని కోరింది.

Search
Categories
Read More
Telangana
మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. ట్రావెల్స్ బస్సులో మంటలు, 13మంది సజీవ దహనం
Bus Accident 
By Sunka Santhosh 2026-03-26 06:15:03 0 236
Andhra Pradesh
బెల్లం తయారీ కేంద్రాన్ని పరిశీలించిన DCCB ఛైర్మన్ నాగార్జున
బాడంగి మండలంలో ఎత్తుకానా సమీపంలో ఉన్న నాబార్డ్ సహకారంతో నిర్వహిస్తున్న రైతుల జట్టు FCC బెల్లం...
By Boiena Rajesh 2026-03-05 01:46:36 0 142
Andhra Pradesh
మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలి చంద్రబాబు.
AP: ఏడాది క్రితం ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా...
By Pagadala Venkateswar 2026-01-24 10:02:36 0 126
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com