తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత గారి ప్రెస్ నోట్

0
386

ప్రెస్ నోట్.

*రేపు నిజామాబాద్ కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన*

*శ్రీ రఘునాథ స్వామి (ఖిల్లా రాంమందిర్) ఆలయంలో శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించనున్న కవిత దంపతులు*

*అనంతరం తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం*

*శ్రీరామ నవమి సందర్భంగా డిచ్ పల్లి, బోధన్,ఆర్మూర్, పోచంపాడు, జగిత్యాల, కోరుట్ల రామాలయాల్లో కవిత దంపతుల తరఫున పట్టు వస్త్రాలు.* 

శ్రీరామ నవమి సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేయనున్నారు. తన మెట్టినిల్లు అయిన నిజామాబాద్ వేదికగా ఆమె చేయనున్న ప్రకటనపై ఆసక్తి నెలకొంది. నిజామాబాద్ జాగృతి కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. అంతకు ముందు శ్రీ రఘునాథ ఆలయం (ఖిల్లా రాంమందిర్) లో జరిగే శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొంటారు. శ్రీ సీతారాముల కళ్యాణంలో తన భర్త దేవనపల్లి అనిల్ తో కలిసి కవిత పాల్గొంటారు. శ్రీ సీతారాములకు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. శ్రీరామ నవమి సందర్భంగా ఆ రాముల వారి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్రంపై ఉండాలని, ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు వెల్లివిరియాలని ఆమె ఆకాంక్షించారు. 

*పలు రామాలయాల్లో పట్టు వస్త్రాల సమర్పణ*

ఏటా శ్రీరామ నవమి సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజవవర్గ పరిధిలోని రామాలయాల్లో కవిత దంపతులు పట్టు వస్త్రాలు సమర్ఫించటం ఆనవాయితీ. ఈ ఏడాది రఘనాథ స్వామి ఆలయంలో కవిత దంపతులు స్వయంగా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. డిచ్ పల్లి, బోధన్, ఆర్మూర్ సిద్దుల గుట్ట, పోచంపాడు, జగిత్యాల్ ధరూర్ క్యాంప్, విద్యానగర్ రామాలయం, కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలంలోని వాల్గొండ రామాలయాల్లో కవిత దంపతుల తరఫున వారి ప్రతినిధులు పట్టు వస్త్రాలు సమర్పించున్నారు. శ్రీరామ నవమి వేడుకల్లో కవిత గారితో పాటు జాగృతి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.

Search
Categories
Read More
Telangana
హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!
హైదరాబాద్ నగరంలో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ పేరుతో ప్రైవేట్ పార్టీలు జరుగుతున్నాయంటూ నటి...
By Ponnala Srinivasrao 2026-07-22 01:53:56 0 33
Andhra Pradesh
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా విచ్చేసిన గద్య అనురాధ
*మహిళల సాధికారతకు విద్యే పునాది : గద్దె అనురాధ*            ...
By Rajini Kumari 2026-03-07 12:07:36 0 285
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : పార్టీ పటిష్టతకు కమిటీలు ఎంతో కీలకం: పెద్దిరెడ్డి
పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, పార్టీ పటిష్టతకు...
By Kothuru Murali 2026-02-03 09:35:02 0 166
Andhra Pradesh
Raj Kasireddy: లిక్కర్ కేసులో ఏ1 రాజ్ కసిరెడ్డి ఆసుపత్రికి తరలింపు.
రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కసిరెడ్డికి అస్వస్థత విజయవాడ జీజీహెచ్ కు తరలింపు వైద్య పరీక్షలు...
By Pagadala Venkateswar 2026-01-21 14:52:35 0 160
Business & Finance
Odisha Continues Clearing Large-Scale Industrial Projects
Odisha is sustaining strong investment momentum by approving multiple large-scale industrial...
By Navya Sree 2026-07-04 06:24:09 0 19
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com