Raj Kasireddy: లిక్కర్ కేసులో ఏ1 రాజ్ కసిరెడ్డి ఆసుపత్రికి తరలింపు.

0
159

రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కసిరెడ్డికి అస్వస్థత

విజయవాడ జీజీహెచ్ కు తరలింపు

వైద్య పరీక్షలు పూర్తయ్యాక తిరిగి జైలుకి తరలించనున్న పోలీసులు

ఏపీ లిక్కర్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కసిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. జైల్లో ఉండగానే ఆయనకు స్వల్ప అనారోగ్యం తలెత్తడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆయన్ను విజయవాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్)కు తరలించారు. ఆసుపత్రిలో రాజ్ కసిరెడ్డికి వైద్యులు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రాథమికంగా స్వల్ప అస్వస్థత కారణంగానే ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. వైద్య పరీక్షలు పూర్తయ్యాక తిరిగి జైలుకు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు.

 

 

లిక్కర్ కేసు నేపథ్యం:

జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీ రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు కూటమి ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో, ఈ కేసులో కీలక నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. లిక్కర్ కేసులో ఏ1 నిందితుడిగా రాజ్ కసిరెడ్డిని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన రిమాండ్ ఖైదీగా జైలులోనే ఉన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
"వెలుగులో రూ. 1.30 కోట్ల అవినీతి!"
చింతూరు మండలంలో 'వెలుగు' (ఇందిరా క్రాంతి పథకం) ద్వారా జరిగిన భారీ అవినీతిపై సీఐటీయూ, గిరిజన మరియు...
By Shyamala Yadagiri 2026-04-16 07:05:36 0 229
Telangana
"ఆదివారం నుంచి కనిపించని బాలుడు.. సమాచారం ఇవ్వాలంటూ పోలీసుల విజ్ఞప్తి.|
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా : బొల్లారం బజార్ ప్రాంతంలో ఏడు సంవత్సరాల బాలుడు అదృశ్యమైన ఘటన...
By Sidhu Maroju 2026-06-03 09:08:58 0 195
Andhra Pradesh
ఉత్తమ కార్యకర్తల ప్రశంస పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే గళ్ళ మాధవి గారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం వారు పంపిన ఉత్తమ కార్యకర్తల ప్రశంస పత్రాలను మన గుంటూరు పశ్చిమ...
By John Baji 2026-01-06 13:12:04 0 226
Telangana
అల్వాల్ డివిజన్ మచ్చ బొల్లారంలో వాటర్ లీకేజ్ : రోడ్లపైకి నీరు గుంతల మయమైన రహదారులు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / మచ్చ బొల్లారం.     అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని...
By Sidhu Maroju 2025-08-08 18:01:56 0 806
Andhra Pradesh
ప్రైవేట్ వైద్యుల వైద్య నిర్లక్ష్యం పై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డి.ఎం.హెచ్. ఓ కార్యాలయం దగ్గర ధర్నా
చీరాల: చీరాల శంకర్ లాప్రోస్కోపీ అండ్ ఇన్ ఫెసిలిటీస్ హాస్పిటల్ లో డెలివరీ నిమిత్తం పండిలనేని సౌమ్య...
By Gadiyapudi Narendra 2026-01-28 12:00:36 0 232
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com