బడిబాట కార్యక్రమం తో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు వెలువ

0
205

*బడిబాట కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లకు వెల్లువ*

 

*బీఆర్ నగర్ మున్సిపల్ హైస్కూల్‌లో తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన*

 

*నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యా రంగానికి నూతన దిశ*

 

*మౌలిక వసతుల మెరుగుదలతో పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి*

 

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో పాఠశాలల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నట్లు అధికారులు తెలిపారు. గురువారం మంగళగిరి పట్టణంలోని కొత్తపేట ఒకటో వార్డులోని బీఆర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌లో గురువారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు.కార్యక్రమంలో భాగంగా కొత్తగా చేరే విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించగా, తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరుగుతోందని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎంఈఓ-1 ఉషా కుమారి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న నూతన విద్యా విధానం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోందన్నారు. ‘తల్లికి వందనం, మధ్యాహ్న భోజన పథకం, ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ వంటి సంక్షేమ పథకాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఎంఈఓ-2 బాబు మాట్లాడుతూ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులతో పూర్తిస్థాయి బోధన కొనసాగుతోందన్నారు. మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్య అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను వినియోగించుకుంటే విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు సంగినేని శ్రీనివాసరావు, మోడల్ ఎలిమెంటరీ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు జి. ఉషా లక్ష్మి, ఉపాధ్యాయులు, సీఆర్పీలు నాగమణి, ధనలక్ష్మి, అజయ్, మధు, మాణిక్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బస్సును వెంబడించి ఆపిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్.. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దంటూ డ్రైవర్‌కు వార్నింగ్!
బస్టాప్‌లో ఆపకుండా వెళ్లిన ఆర్టీసీ బస్సు వెంబడించి అడ్డగించిన పెనమలూరు ఎమ్మెల్యే బోడె...
By Pagadala Venkateswar 2026-05-08 05:44:04 0 119
Andhra Pradesh
మదనపల్లె: ఇంటి వివాదంలో వ్యక్తిపై కర్రలతో దాడి.
మదనపల్లె పట్టణంలోని రాజారెడ్డి కాలనీలో మంగళవారం సాయంత్రం ఇంటి ఖాళీ విషయంపై తలెత్తిన వివాదం...
By Pagadala Venkateswar 2026-02-11 05:52:06 0 152
Telangana
డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.|
హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త, జాతీయవాది నాయకుడు డాక్టర్ శ్యామ్  ప్రసాద్...
By Sidhu Maroju 2026-06-23 08:25:58 0 93
Telangana
సింగరేణి వ్యాప్తంగా ఉద్యోగుల పిల్లలకు వేసవి శిక్షణ శిబిరలకు నిధులు కేటాయింపు
సింగరేణి ఉద్యోగుల పిల్లల కోసం వేసవి శిక్షణ శిబిరాలకు  యాజమాన్యం నిధులు కేటాయించింది అన్ని...
By Avunoori Mahesh 2026-04-22 14:22:32 0 146
Andhra Pradesh
రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & విద్యాశాఖ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనాయకులు యువగళం సారథి శ్రీ నారా లోకేష్ గారి జన్మదినము సందర్భంగా
రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & విద్యాశాఖ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన...
By Chennaiah Kati 2026-01-24 06:09:36 0 323
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com