బడిబాట కార్యక్రమం తో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు వెలువ

0
206

*బడిబాట కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లకు వెల్లువ*

 

*బీఆర్ నగర్ మున్సిపల్ హైస్కూల్‌లో తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన*

 

*నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యా రంగానికి నూతన దిశ*

 

*మౌలిక వసతుల మెరుగుదలతో పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి*

 

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో పాఠశాలల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నట్లు అధికారులు తెలిపారు. గురువారం మంగళగిరి పట్టణంలోని కొత్తపేట ఒకటో వార్డులోని బీఆర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌లో గురువారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు.కార్యక్రమంలో భాగంగా కొత్తగా చేరే విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించగా, తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరుగుతోందని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎంఈఓ-1 ఉషా కుమారి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న నూతన విద్యా విధానం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోందన్నారు. ‘తల్లికి వందనం, మధ్యాహ్న భోజన పథకం, ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ వంటి సంక్షేమ పథకాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఎంఈఓ-2 బాబు మాట్లాడుతూ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులతో పూర్తిస్థాయి బోధన కొనసాగుతోందన్నారు. మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్య అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను వినియోగించుకుంటే విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు సంగినేని శ్రీనివాసరావు, మోడల్ ఎలిమెంటరీ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు జి. ఉషా లక్ష్మి, ఉపాధ్యాయులు, సీఆర్పీలు నాగమణి, ధనలక్ష్మి, అజయ్, మధు, మాణిక్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
గుడిమెట్లలో ఘనంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
    భక్తిశ్రద్ధలతో పాతపాటి అంకమ్మ, నీలగిరి అంకమ్మ, గంగమ్మ, కాటమరాజు విగ్రహాల...
By Patan Khuddus 2026-05-08 11:45:54 0 278
Andhra Pradesh
యువతకు భరోసా టీడీపీ పాలనలోనే సాధ్యం ఐటిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి జి నాగేంద్ర నాయుడు
రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించిన పదివేల 600 ఉద్యోగాలతో కూడిన మెగా జాబ్...
By Benguluri Madhubabu 2026-03-20 11:13:09 0 239
Telangana
రూ.2.08.కోట్ల విలువైన, దొంగలించిన 1,039 మొబైల్ ఫోన్ ల రికవరీ. |
       మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్...
By Sidhu Maroju 2026-01-09 06:25:04 0 205
Andhra Pradesh
ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం
పోలవరం జిల్లా చింతూరు మండలంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ఆకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో...
By Shyamala Yadagiri 2026-03-20 03:01:26 0 293
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ : రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలైన ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల...
By Kothuru Murali 2026-01-18 09:30:56 0 166
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com