మిట్టి కేఫ్ కోసం టెండర్లను స్వీకరిస్తున్న జిల్లా కోర్టు

0
156

జిల్లా కోర్టులో ‘మిట్టీ కెఫే’..

 

దివ్యాంగులకు ఉపాధి అవకాశం

 

శ్రీకాకుళం, మార్చి 24: జిల్లా కోర్టు సముదాయంలోని ఫోర్ కోర్ట్స్ భవనం సెల్లార్‌లో ‘మిట్టీ కెఫే’ ఏర్పాటుకు గౌరవ హైకోర్టు ఆమోదం తెలిపింది. ఈ మేరకు జిల్లా ప్రధాన న్యాయస్థానం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. సామాజిక బాధ్యతలో భాగంగా ఈ కెఫేను కేవలం దివ్యాంగుల ద్వారానే నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు. ఆసక్తి గల అర్హులు తమ టెండర్లను ఏప్రిల్ 2వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు జిల్లా కోర్టు కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. కెఫేకు సంబంధించిన విద్యుత్ వినియోగ ఛార్జీలను టెండర్ దక్కించుకున్న వారే భరించాల్సి ఉంటుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీలో భారీగా సంక్రాంతి సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే
2026 నూతన సంవత్సరం వచ్చేసింది. జనవరిలో వచ్చే సంక్రాంతి పండుగ భారీగా సెలవును మోసుకొచ్చింది. ఏపీలో...
By Pagadala Venkateswar 2026-01-08 11:17:36 0 178
Andhra Pradesh
ఆగి ఉన్న లారీ కింద నిద్రించి.. చక్రాల కింద నలిగి యువకుడు మృతి.
మదనపల్లెలోని నిమ్మనపల్లి రోడ్డులో ఆదివారం రాత్రి ఆగి ఉన్న లారీ కింద నిద్రపోయిన అశోక్ కుమార్ (26)...
By Pagadala Venkateswar 2026-03-16 07:03:25 0 117
Andhra Pradesh
ఉత్తమ కార్యకర్తలను సన్మానించిన కోడుమూరు ఎమ్మెల్యే !!
కర్నూలు : కోడుమూరు :  టీడీపీ  పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు...
By Hari Krishna 2025-12-31 11:12:58 0 180
Telangana
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి స్థిర ప్రతిష్ట : పాల్గొన్న ఎమ్మెల్యే
         మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / మచ్చ బొల్లారం.  ...
By Sidhu Maroju 2025-08-10 16:18:13 0 723
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com