,ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న బిజెపి పార్టీ అధికార ప్రతినిధి గురురాజ్ దేశాయ్,

0
238

 

మండలకేంద్రమైన నందవరం లొని బిజెపి కార్యలయంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిథి గురురాజ్ దేశాయ్ గారితో సమావేసం ఏర్పాటుచేసిన నాబార్డ్ అదికారులు.... 

ఈ నెల 10 వ తారికున ఆంధ్రజ్యోతి 

దినపత్రికలో ప్రచురితమైన

 " స్థలం ఉన్నా మార్కెట్ లేదు " 

అనే శీర్షిక ఆధారంగా నాబార్డు అదికారులు గతంలోనే బిజెపి నాయకులు గురురాజ్ దేశాయ్ గారితో చరవాణిలో మాట్లాడి విషయం తెలుసుకుని ఆయన ఆహ్వనం మేరకు మండలకేంద్రంలోని బిజెపి కార్యలయంలో నాబార్డు అదికారులు సమావేశం ఏర్పాటుచేయడం జరిగింది.

ఈ సందర్బంగా జిల్లా నాబార్డు కు సంబందించిన ప్రతినిథి దామోదర రెడ్డిగారు మాట్లాడుచూ పూర్తిగా బిజెపి కేంద్రప్రభుత్వం అధీనంలో పనిచేస్తున్న నాబర్డ్ సంస్థ మార్కెట్ నిర్మాణానికి 15 లక్షలు నిదులు కేటాయిస్తుందని, గ్రామపంచాయతి ఒకలక్ష డెబ్భై వేలరూపాయలు భరించవలసి వస్తుందని అలాగే కనీసం 20 సెంట్ల స్థలం కూడా గ్రామపంచాయతి ఇవ్వవలసివస్తుందని తెలిపారు.

ఈ మర్కెట్ ను నాబార్డు సంస్థ కట్టించి అందులొ ఒకచిన్న కార్యాలయాన్ని మరియు ప్రజలకు వాష్రూమ్ లను కూడ ఏర్పాటుచేసి గ్రామపంచాయతికు అలాట్మెంట్ చేస్తుందని వివరించారు.

అలాగే దేశంలొ అన్నిరాష్ట్రాలలో గ్రామాల అభివృద్ది పనులకు నాబార్డు సంస్థ ద్వారా పూర్తిగా నూరుశాతం బిజెపి కేంద్రప్రభుత్వం నిదులను ఇస్తుందని రాష్ట్రప్రభుత్వాలు ఈ కార్యక్రమాలకు నాబార్డుకు నిధులు కేటాయించడంలో భాగస్వామ్యం వహించవని తెలియచేశారు.

అనంతరం గురురాజ్ దేశాయ్ గారు స్థానిక ఎంపీడీఓ గారితొ చరవాణిలో మాట్లాడి గ్రామపంచాయతి ఆవరణంలో 20 సెంట్ల స్థలాన్ని మార్కెట్ కోసం కేటాయించాలని కోరారు, అందుకు ఎంపీడీఓ గారు సానుకూలంగా స్పందించి నాబార్డు అధికారులసమక్షంలో కొలతలు కూడా తీసుకొవడం జరిగింది. 

ఈ మార్కెట్ నిర్మాణానికి నిదులు విడుదల చెయ్యడానికి జిల్లా నాబార్డ్ అదికారులు ముంబయిలోని నాబార్డు కేంద్రకార్యాలయానికి త్వరలొనే ప్రతిపాదనలు పంపుతామని అలాగే నిదులు విడుదల కావడానికి కనీసం రెండు నెలలు సమయం పట్టవచ్చని దామోదర రెడ్డి తెలియచేశారు.

మార్కెట్ నిర్మాణం జరిగిన తరువాత మార్కెట్ ఎలావుంటుందనే నమూనాలు కూడా ఇవ్వడం జరిగింది. 

ఈ సందర్బంగా గురురాజ్ దేశాయ్ గారు మాట్లాడుచూ కేవలం నందవరంలొనే కాకుండగా నాగాలదిన్నె, హలహర్వి మరియు మిగతా మేజర్ గ్రామపంచాయితీ పరిధిలో కూడా నాబార్డు సంస్థ తరపున స్థానిక మర్కెట్ కొరకు నిదులు కేటాయించాలని అందుకు కేంద్ర బిజెపి నాయకులతొ కూడా మాట్లాడి వారి సహాయంకూడా తీసుకుని మండలంలో నాబార్డ్ సహాయంతో గ్రామ అభివృద్ది పనులు చెయ్యడానికి కృషిచేస్తానని తెలిపారు.

అలాగే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నో అభివృద్ది పనులు చేస్తున్నందుకు రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా నాబార్డు అదికారులు, బిజెపి నాయకులు మరియు వివిద గ్రామాల టిడిపి నాయకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రమాద బీమాతో ఆదుకున్న తెలుగుదేశం పార్టీ - బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల చెక్కు అందజేత
బాపట్ల నియోజకవర్గం, కర్లపాలెం మండలం, పెదపులుగువారిపాలెం గ్రామానికి చెందిన అక్కల కృష్ణారెడ్డి...
By Vadlamudi NagaVenkat 2026-03-17 09:42:38 0 598
Andhra Pradesh
రైతుగా మారిన రాష్ట్ర జన వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
పశ్చిమగోదావరి జిల్లా-పాలకొల్లు.    మంత్రి నిమ్మల రామానాయుడు స్క్రోలింగ్ పాయింట్లు....
By Rajini Kumari 2025-12-26 09:53:24 0 153
Telangana
మరొకరి ప్రాణం తీసిన చైనా మాంజా.|
    హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా ఫసల్వాది గ్రామంలో చైనా మాంజాతో గొంతు తెగి వ్యక్తి...
By Sidhu Maroju 2026-01-15 07:31:41 0 152
Andhra Pradesh
అన్నమయ్య: పోలీసుల స్పెషల్ వీడియో.
అన్నమయ్య జిల్లా పోలీస్ యంత్రాంగం మహిళల భద్రతకు పెద్దపీట వేస్తోంది. ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు...
By Pagadala Venkateswar 2026-03-07 04:51:21 0 78
Andhra Pradesh
ఉపాధి హామీ చట్టం రద్దు కేంద్రం కుట్ర రాష్ట్ర కార్యదర్శి సిపిఎం వి శ్రీనివాసరావు
For Scrolling : ఉపాధి హామీ చట్టం రద్దుకు కేంద్రం కుట్ర. తక్షణం ఉపసంహరించాలని సిపియం రాష్ట్ర...
By Rajini Kumari 2025-12-16 09:50:20 0 125
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com