Ayyanna Patrudu: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు... కీలక నిర్ణయం తీసుకున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు!

0
145

ఇకపై డిజిటల్ విధానంలోనే ఎమ్మెల్యేల హాజరు నమోదు చేయాలని నిర్ణయించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు

వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగానికి మాత్రమే హాజరై, మిగతా సమావేశాలకు దూరంగా ఉంటున్న వైనం 

కొందరు సభ్యులు హాజరు రిజిస్టర్‌పై సంతకం చేసి వెంటనే వెళ్లిపోతున్నారని ఆరోపణలు 

 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేల వరుస గైర్హాజరుపై శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై డిజిటల్ విధానంలోనే ఎమ్మెల్యేల హాజరు నమోదు చేయాలని నిర్ణయించారు. సభకు హాజరుకాకుండా కొందరు సభ్యులు జీతాలు తీసుకోవడం, ఎమ్మెల్యేలుగా కొనసాగడం ఎంత వరకు సబబని స్పీకర్ ఇప్పటికే పలుమార్లు అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనకు ఉన్న విచక్షణాధికారాలతో హాజరు విధానంపై కఠిన నిర్ణయం తీసుకున్నారు.

 

అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇప్పటి వరకు వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగానికి మాత్రమే హాజరై, మిగతా సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. వరుసగా 60 రోజుల పాటు శాసనసభ సమావేశాలకు గైర్హాజరైతే అనర్హత వేటు వేయొచ్చని చట్టంలో నిబంధన ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే గవర్నర్ ప్రసంగానికి మాత్రమే హాజరైతే అది సమావేశాలకు హాజరైనట్టు పరిగణనలోకి రాదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 

 

ఈ నేపథ్యంలో గతంలో కొందరు సభ్యులు హాజరు రిజిస్టర్‌పై సంతకం చేసి వెంటనే వెళ్లిపోతున్నారని ఆరోపణలు రావడంతో అలాంటి పరిస్థితులకు చెక్ పెట్టేందుకే డిజిటల్ హాజరు విధానాన్ని స్పీకర్ అమలు చేయాలని నిర్ణయించారు. కాగా, ఈరోజు గవర్నర్ ప్రసంగం తర్వాత జరిగే బీఏసీ సమావేశంలో సభ ఎన్నిరోజులు నిర్వహించాలనేదానిపై నిర్ణయం తీసుకోనున్నారు. 

Search
Categories
Read More
Business & Finance
Airport City Project Boosts Bengaluru Investment
Prestige Group is advancing its ₹1,800-crore integrated Airport City project in Bengaluru. The...
By Navya Sree 2026-06-30 07:44:39 0 85
Telangana
నర్సంపేట పట్టణం రేపు బందుకు పిలుపునిస్తుంది
నర్సంపేట పట్టణంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గారు  ఆత్మ ...
By Gujile Ramu 2026-04-23 16:05:54 0 217
Telangana
పి డి ఎస్ యూ తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలను విజయవంతం చేయండి.
మహబూబాబాద్. డిసెంబర్.27 (భారత్ అవాజ్): కొత్తగూడ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో PDSU...
By Bheeshman King 2025-12-27 12:09:34 0 311
Telangana
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ హత్య కేసులో ఆరుగురు మహిళలకు జీవిత ఖైదు.|
హైదరాబాద్ : ఐదేళ్ల క్రితం జరిగిన హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ హత్య కేసులో మృతుడి...
By Sidhu Maroju 2025-12-31 18:55:45 0 192
Andhra Pradesh
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎరిక్షన్ బాబు గారు - ₹ 15 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం - హర్షం వ్యక్తం చేసిన ప్రజలు
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎరిక్షన్ బాబు గారు - ₹ 15 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం - హర్షం...
By Chennaiah Kati 2026-03-08 04:20:14 0 354
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com