Ayyanna Patrudu: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు... కీలక నిర్ణయం తీసుకున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు!

0
144

ఇకపై డిజిటల్ విధానంలోనే ఎమ్మెల్యేల హాజరు నమోదు చేయాలని నిర్ణయించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు

వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగానికి మాత్రమే హాజరై, మిగతా సమావేశాలకు దూరంగా ఉంటున్న వైనం 

కొందరు సభ్యులు హాజరు రిజిస్టర్‌పై సంతకం చేసి వెంటనే వెళ్లిపోతున్నారని ఆరోపణలు 

 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేల వరుస గైర్హాజరుపై శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై డిజిటల్ విధానంలోనే ఎమ్మెల్యేల హాజరు నమోదు చేయాలని నిర్ణయించారు. సభకు హాజరుకాకుండా కొందరు సభ్యులు జీతాలు తీసుకోవడం, ఎమ్మెల్యేలుగా కొనసాగడం ఎంత వరకు సబబని స్పీకర్ ఇప్పటికే పలుమార్లు అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనకు ఉన్న విచక్షణాధికారాలతో హాజరు విధానంపై కఠిన నిర్ణయం తీసుకున్నారు.

 

అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇప్పటి వరకు వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగానికి మాత్రమే హాజరై, మిగతా సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. వరుసగా 60 రోజుల పాటు శాసనసభ సమావేశాలకు గైర్హాజరైతే అనర్హత వేటు వేయొచ్చని చట్టంలో నిబంధన ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే గవర్నర్ ప్రసంగానికి మాత్రమే హాజరైతే అది సమావేశాలకు హాజరైనట్టు పరిగణనలోకి రాదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 

 

ఈ నేపథ్యంలో గతంలో కొందరు సభ్యులు హాజరు రిజిస్టర్‌పై సంతకం చేసి వెంటనే వెళ్లిపోతున్నారని ఆరోపణలు రావడంతో అలాంటి పరిస్థితులకు చెక్ పెట్టేందుకే డిజిటల్ హాజరు విధానాన్ని స్పీకర్ అమలు చేయాలని నిర్ణయించారు. కాగా, ఈరోజు గవర్నర్ ప్రసంగం తర్వాత జరిగే బీఏసీ సమావేశంలో సభ ఎన్నిరోజులు నిర్వహించాలనేదానిపై నిర్ణయం తీసుకోనున్నారు. 

Search
Categories
Read More
Telangana
పెద్దపల్లి : సోమవారం NEET ఎగ్జామ్ కు ఫ్రీ బస్
తెలంగాణ 21-06-2026 రోజున నీట్ ఎగ్జామ్  రాసేవారికి TGSRTC ఉచిత బస్సు ఏర్పాటు చేశారు. పల్లె...
By Sunka Santhosh 2026-06-20 13:31:59 0 150
Andhra Pradesh
రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన బాలుడికి జనసేన అండ.
మదనపల్లెలో రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయి, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న...
By Pagadala Venkateswar 2026-06-16 13:00:37 0 63
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు టౌన్ వైసీపీ నేత అంబటి రాంబాబు పై చర్యలు తీసుకోవాలి
పుంగనూరు పోలీస్ స్టేషన్ లో వైసీపీ నేతలు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబుపై...
By Kothuru Murali 2026-01-31 16:09:08 0 189
Bihar
Bihar University Governance: Clearing Faculty Hurdles
The Governor’s Secretariat in Bihar is currently engaged in a critical push to finalize the...
By Lokeshwari Panthadi 2026-07-02 04:13:10 0 39
Andhra Pradesh
International drugs gang secret revealed
అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.   రూ.1.06 కోట్ల విలువైన 213 కేజీల గంజాయి పట్టివేత....
By G k Nookala 2026-06-17 08:45:39 0 118
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com