అంబేద్కర్ వారసులమా? అరాచకవాదులమా? - ఎమ్మెల్యేపై బీజేపీ ఫైర్!

0
136

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మండుల సామెల్ హిందూ ధర్మం మరియు వేద పండితులపై చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలను బీజేపీ మేడ్చల్ అర్బన్ సెక్రటరీ మాణిక్య రెడ్డి మరియు కె. శ్రీనివాస్ వర్మ తీవ్రంగా ఖండించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల తీరుపై నిప్పులు చెరిగారు.

"క్రైస్తవ మతాన్ని అనుసరిస్తూ, ఎస్సీ సర్టిఫికెట్ ద్వారా రాజ్యాంగ ఫలాలను పొందుతున్న మండుల సామెల్.. అదే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారిని అవమానించడం సిగ్గుచేటు. ఇది కేవలం పండితులపై దాడి కాదు, హిందూ సమాజంపై జరిగిన దాడి" అని వారు విమర్శించారు.

రాష్ట్రంలో దళితులు, గిరిజనులపై జరుగుతున్న దాడులకు కాంగ్రెస్ పార్టీయే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. 

ప్రజా సమస్యలను గాలికొదిలేసి, నియోజకవర్గంలో ఇసుక దందా, వైన్ షాపుల సెటిల్మెంట్లు, రియల్ ఎస్టేట్ డీల్స్‌లో కాంగ్రెస్ నాయకులు మునిగిపోయారని మండిపడ్డారు.

హిందూ సమాజాన్ని అవమానిస్తూ, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని, తగిన గుణపాఠం చెబుతామని వారు హెచ్చరించారు.

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Bihar
Who will become CM face of Mahagathbandhan in Bihar? | Here is what Congress leaders said
Bihar Assembly lections 2025: The Bihar Assembly elections are scheduled for the end of 2025, and...
By BMA ADMIN 2025-05-19 18:41:55 0 2K
Telangana
జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం- మంత్రి పొంగులేటి.|
హైదరాబాద్: పది రోజుల్లో అక్రిడిటేషన్ కార్డుల జీవో. వచ్చే ఏడాది ఇళ్ల స్థలాల కేటాయింపు పై తీపి...
By Sidhu Maroju 2025-12-20 10:49:21 0 156
Andhra Pradesh
అక్రమాలకు పాల్పడుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీస్
*ప్రచురణార్థం*   భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ.  ...
By Rajini Kumari 2026-02-06 11:32:19 0 107
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com