నిజాంపేట్ అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు

0
224

నిజాంపేట్ సర్కిల్ లోని పలు కాలనీలలో వెలసిన అక్రమ నిర్మాణాలను మంగళవారం టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. సర్కిల్ లోని ప్రగతినగర్ లో పొందిన అప్రూవల్ అనుమతుల ప్రకారం కాకుండా నిబంధనలు ఉల్లంఘిస్తూ చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. అలాగే నిజాంపేట్ లోని రెడ్డి ఎవెన్యూ కాలనీలో చట్ట విరుద్ధంగా నిర్మించిన ఓ భవంతి స్లాబ్స్, గోడలను ధ్వంసం చేశారు.ఈ సందర్బంగా నిజాంపేట్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ ప్రసీద మాట్లాడుతూ ప్రతీ బిల్డర్ పొందిన అనుమతులు ప్రకారం మాత్రమే నిర్మాణం చేపట్టాలని సూచించారు. నిబంధనలకు విరుద్దంగా, పొందిన అప్రూవల్ ప్లాన్ కు వ్యతిరేకంగా నిర్మాణం చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులస్తే, అమరావతి సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు బుధవారం ఫిర్యాదు చేశారు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం రెడ్డివారిపల్లి సమీపంలో అన్ని అనుమతులు ఉన్న...
By Kothuru Murali 2026-01-08 12:58:02 0 113
Andhra Pradesh
బొబ్బిలి మున్సిపాలిటీ అభివృద్ధికి సంపూర్ణ సహాయ సహకారాలు
మున్సిపాలిటీ అభివృద్ధికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే బేబినాయన చెప్పారు. మున్సిపల్...
By Boiena Rajesh 2026-03-21 10:54:58 0 153
Andhra Pradesh
ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా డి.సురేష్ బాబు
ప్రోగ్రెసివ్ ప్యానల్ మద్దతు తో ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా డి.సురేష్ బాబు ఏకగ్రీవంగా...
By Karapati Gopi 2025-12-28 14:56:18 0 242
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com