ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి
సూర్యమోహన్మ మాద్దూర్ మండలం రిపోర్టర్
ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి
నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం మద్దూర్ మండలం రేనివాట్ల గ్రామం సమీపంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ విషాదం చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రేనివాట్ల సమీపంలో ఒక ట్రాక్టర్ అతివేగంతో వెళ్తూ అకస్మాత్తుగా అదుపు తప్పి తిరగబడింది.ఈ ప్రమాద సమయంలో ట్రాక్టర్పై ఉన్న రాములు అనే వ్యక్తి దాని కింద పడిపోయారు.ట్రాక్టర్ కింద చిక్కుకుపోవడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని రాములును రక్షించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయితే గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో రాములు అక్కడికక్కడే మృతి చెందారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనతో స్థానిక ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz