ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్ దగ్గర రిలే నిరాహార దీక్ష

0
108

_ఎమ్మిగనూరు పట్టణంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బుట్టా రేణుక గారి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీలను టీడీపీ కూటమి ప్రభుత్వం ఆప్కోలో విలీనం చేయాలనే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ చేనేత కార్మికులు, చేనేత నాయకులు మరియు వైసీపీ నాయకులు పెద్దఎత్తున రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమం ఎమ్మిగనూరు పట్టణంలోని డాక్టర్ పద్మశ్రీ మాచాని సోమప్ప గారి కూడలి వద్ద ఉద్వేగభరిత వాతావరణంలో జరిగింది.ఈసందర్భంగా మాట్లాడిన నాయకులు, ఎమ్మిగనూరు వివర్స్ కో-ఆపరేటివ్ సొసైటీలు ఆప్కోలో విలీనం అనే నిర్ణయం చేనేతల అస్తిత్వంపై నేరుగా దాడి చేసినట్లేనని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుల్లో కూరుకుపోయిన ఆప్కోలో లాభదాయకంగా, స్థిరంగా నడుస్తున్న ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీలను విలీనం చేయడం వెనుక తీవ్రమైన దురుద్దేశం ఉందని ఆరోపించారు. ఈ చర్య వల్ల చేనేతల స్వావలంబన పూర్తిగా దెబ్బతిని, మళ్లీ మధ్యవర్తుల ఆధీనంలోకి వెళ్లే పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Telangana
*కొల్‌కతాలో ఉద్రిక్తత.. మెస్సి ఈవెంట్‌ ఆర్గనైజర్‌ అరెస్టు*
అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సి కోల్‌కతా టూర్‌ సందర్భంగా...
By SivaNagendra Annapareddy 2025-12-13 13:38:31 0 293
Andhra Pradesh
పొగ మంచు
మంగళవారం ఉదయం పుంగనూరు నియోజకవర్గంలో దట్టమైన పొగమంచు కారణంగా ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు...
By Kothuru Murali 2025-12-23 06:06:00 1 230
Andhra Pradesh
పులిచెర్ల: ఊపిరి పీల్చుకున్న రైతులు
చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలంలో పంటలను ధ్వంసం చేస్తున్న జంట ఏనుగులు శుక్రవారం పాకాల మండలంలోని...
By Kothuru Murali 2026-01-31 04:28:10 0 103
Telangana
నిజామాబాద్: జాతీయలోక్అధలత్ల్5,662 కేసుల పరిశ్కారం
గథానెలరోజుల నుండి నిర్వాహిస్తునా జాతీయలోక్ అధలత్లోభాగంగా జిల్లా వ్యాప్తంగ వివిధా పోలీసు స్టెషాన్...
By Sadaq Sadaq 2026-03-29 17:46:07 0 87
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com